
ఆస్ట్రేలియా, భారత్ జట్ల మధ్య పెర్త్లో జరుగుతున్న మొదటి వన్డేకు వర్షం అంతరాయం కలిగిస్తోంది. భారత్ ఇన్నింగ్స్ మధ్యలో వర్షంకురవడంతో కొంతసేపు మ్యాచ్ నిలిపివేశారు.మరో 3 ఓవర్లు ఆట కొనసాగిన వెంటనే మరోసారి వరుణుడు ఆటంకం కలిగించాడు.రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, శుభ్మన్ గిల్ తక్కువ స్కోరుకే అవుటయ్యారు.మొదట 8.5 ఓవర్లలో భారత్ 25/3 స్కోరు వద్ద,11.5 ఓవర్లో 37/3 వద్ద మరోసారి మ్యాచ్ నిలిపివేశారు.ఆట మధ్యాహ్నం దాదాపు ఒంటి గంటకు మొదలయ్యే అవకాశం ఉంది.