
ఏపీలో పొగాకు రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. బ్లాక్ బర్లీ సాగు చేసిన రైతులు పంటకు గిట్టుబాటు ధర లేదంటున్నారు. ఎంతోకొంతకు అమ్ముకుందామని వెళ్తే.. గ్రేడింగ్ పేరుతో పొగాకు బేళ్లను వెనక్కి పంపుతున్నారని ఆవేదన చెందుతున్నారు. గిట్టుబాటు ధరకు పొగాకు కొనుగోళ్లు జరగడం లేదంటూ.. రైతు సంఘాల నేతలు కూడా మార్కెట్ యార్డుల్లో ఆందోళనలు చేస్తున్నారు. ప్రభుత్వం ఏడు కేంద్రాల్లో కొనుగోళ్లు జరుపుతామన్నా.. పూర్తిస్థాయిలో కొనుగోళ్లు జరగడం లేదని చెబుతున్నారు.