ఆస్ట్రేలియాలోని బోండీబీచ్లో యూదుల హనూకా వేడుకలపై దాడి చేసిన వారిని దర్యాప్తు బృందం గుర్తించింది. నవీద్ అక్రమ్ (24), సాజిద్ అక్రమ్ (50) అనే తండ్రీకొడుకులు ఈ ఉగ్రదాడికి పాల్పడినట్లు పేర్కొంది. పోలీసులు జరిపిన ఎదురుదాడిలో సాజిద్ ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. మరోవైపు ఈ ఘటనలో మృతుల సంఖ్య 16కు పెరిగింది. గాయపడ్డ 40 మందికి సమీపంలోని ఆస్పత్రుల్లో చికిత్స అందిస్తున్నారు. యూదులపై కాల్పుల ఘటనను ప్రపంచ దేశాలు తీవ్రంగా ఖండించాయి.

