బీహార్లో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ మరియు ఆర్జేడీ నేత తేజస్వి యాదవ్ చేపట్టిన ‘ఓటర్ అధికార్ యాత్ర’ విస్తృతంగా కొనసాగుతోంది. ఓటర్ల జాబితాలో అవకతవకలు జరుగుతున్నాయనే ఆరోపణల నేపథ్యంలో ఈ యాత్ర ప్రారంభమైంది. ఆదివారం అరరియా జిల్లాలో ఇద్దరు నాయకులు బుల్లెట్ బైక్పై ప్రయాణించి ప్రజల దృష్టిని ఆకర్షించారు. రోడ్లపై భారీ సంఖ్యలో ప్రజలు చేరుకుని వారిని ఆత్మీయంగా అభివాదం చేశారు

