నిజాంపేట సర్కిల్ ప్రగతి నగర్ కమాన్ సమీపంలోని మియాపూర్ రోడ్డులో ఉన్న ఫర్నీచర్ మార్కెట్లో మంటలు చెలరేగడంతో బీభత్సం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో సుమారు 60వరకు దుకాణాలు కాలి బూడిదయ్యాయి. కోట్లాది రూపాయల ఆస్తి నష్టం వాటిల్లింది. మంగళవారం రాత్రి 11 గంటలకు. మార్కెట్లోని మూడో ఓ షాపునకు సమీపంలో ఉన్న విద్యుత్ స్తంభం నుంచి నిప్పు రవ్వలు పడ్డాయి. అవి పక్కనే ఉన్న ఫర్నీచర్ షాప్నకు అంటుకున్నా. అలా ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా అగ్ని కీలలు వ్యాపించాయి.

