ఏడాదిన్నరగా రాజకీయ అస్థిరతను ఎదుర్కొంటున్న బంగ్లాదేశ్లో గురువారం 13వ జాతీయ పార్లమెంట్ ఎన్నికల ఓటింగ్ ప్రారంభమైంది. మాజీ ప్రధాని షేక్ హసీనా నేతృత్వంలోని అవామీ లీగ్ ప్రభుత్వం 2024 ఆగస్టులో విద్యార్థుల భారీ ఉద్యమంతో కూలిపోయిన తర్వాత ఏర్పడిన తాత్కాలిక పాలనకు ఇవి ముగింపు పలకనున్నాయి.
ఈసారి 299 పార్లమెంట్ స్థానాలకు 1,981 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. బంగ్లాదేశ్ రాజకీయాల్లో ప్రభావం చూపిన ప్రధాన పార్టీ అవామీ లీగ్ లేకుండా ఎన్నికలు జరగడం ఇదే తొలిసారి కావడం విశేషం

