అమెరికా, ఇరాన్ల మధ్య మరోమారు చర్చలు జరగనున్నాయనే వార్తలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామాలను అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ధ్రువీకరించారు. రాబోయే రెండు రోజుల్లో ఇరాన్తో చర్చలు జరగవచ్చని డోనాల్డ్ ట్రంప్ ది న్యూయార్క్ పోస్టుకు తెలిపారు. ఈ చర్చలు పాకిస్తాన్లో జరగనున్నాయని చెప్పారు. చర్చలు జరుగుతున్నాయని, అయితే అవి నెమ్మదిగా సాగుతున్నాయని తెలిపారు. ఇరుదేశాల మధ్య యుద్ధాన్ని ముగించడానికి జరిగే రెండో విడత ప్రత్యక్ష చర్చలు బహుశా ఐరోపాలో ఎక్కడో ఒకచోట జరుగుతాయని ట్రంప్ సంకేతాలు ఇచ్చారు.

