తెలంగాణలో గత ప్రభుత్వం చేపట్టిన జిల్లాల విభజన అశాస్త్రీయంగా ఉందని, దీనివల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అసెంబ్లీ వేదికగా స్పష్టం చేశారు. ఒకే నియోజకవర్గంలోని మండలాలు మూడు, నాలుగు వేర్వేరు జిల్లాల్లో కలిసి ఉండటం వల్ల అటు ఎమ్మెల్యేలకు, ఇటు సామాన్య ప్రజలకు పాలన దూరమైందని వివరించారు.అందుకే జిల్లాల సరిహద్దులను, రెవెన్యూ డివిజన్లను పునర్ వ్యవస్థీకరించేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోందని మంత్రి ప్రకటించారు.

