తిరుమలలో ఓ భక్తురాలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ప్రస్తుతం తమిళనాడు అసెంబ్లీ ఎన్నికలు జరగుతుండగా… నటుడు విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీకి ఓటు వేయాలని తిరుమల కొండపై నుంచి అభ్యర్థించారు. ‘‘వోట్ ఫర్ టీవీకే’’ అని కోరడమే కాకుండా… ఆ పార్టీ గుర్తు అయిన విజిల్ కూడా తన మెడలో వేసుకున్నారు. తిరుమల కొండపై ఇంత జరుగుతున్నా టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారని భక్తులు ప్రశ్నించారు. వాటిని నియంత్రించేందుకు క్షేత్ర స్థాయిలో సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు.

