తెలంగాణ చరిత్రలో మాజీ సిఎం కెసిఆర్ కు ఒక పుస్తకమే ఉంటుందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కవిత తెలిపారు. కెసిఆర్ చరిత్రను ఎవరూ చెరిపేయలేరని అన్నారు. హైదరాబాద్ లో జాగృతి ఆధ్వర్యంలో ఈ నెల 12న ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నామని తెలియజేశారు. కెసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కొనే ధైర్యం సిఎం రేవంత్ రెడ్డికి లేదని, కెసిఆర్ ను రాజకీయంగా ఎదుర్కోలేకనే రేవంత్ రెడ్డి తిడుతున్నారని విమర్శించారు.

