ఆంధ్రప్రదేశ్లో పాలిటెక్నిక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం వేచి చూస్తున్న విద్యార్థులకు కీలక అప్డేట్ వచ్చేసింది. పాలిసెట్-2026 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ మంగళవారం విడుదల చేశారు. అధికారిక వెబ్సైట్: https://polycetap.ap.gov.in ఈ ఏడాది పాలిసెట్ ప్రవేశ పరీక్షకు మొత్తం 1,77,581 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 1,63,008 మంది పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల విడుదల సందర్భంగా విద్యార్థులందరికీ మంత్రి లోకేశ్ శుభాకాంక్షలు తెలియజేశారు.

