ఉప్పల్ మెట్రో స్టేషన్ కు బాంబు బెదిరింపు వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ కాల్ చేసి ఉప్పల్ మెట్రో స్టేషన్ లో బాంబు పెట్టామని బెదిరించడంతో స్థానిక పోలీసులు డాగ్ స్కాడ్ సహాయంతో తనిఖీలు చేపట్టారు. ఎక్కడా బాంబు పెట్టిన ఆనవాళ్లు లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. అనుమానాస్పద వస్తువలేవీ కనిపించలేదని పోలీసులు తెలిపారు. ఫోన్ చేసిన వ్యక్తి గురించి పోలీసులు ఆరా తీస్తున్నారు.

