
నా గుండె తరుక్కుపోతోంది అంటూ చార్మినార్ అగ్నిప్రమాదంపై మిస్ వరల్డ్ ఓపల్ సుచాత చువాంగ్శ్రీ స్పందించారు. ఇటీవల హైదరాబాద్ కు వచ్చిన తొలి రోజుల్లో మిస్ వరల్డ్ కంటెస్టెంట్స్ చార్మినార్ సందర్శించారు. అక్కడ తనతో కలిసి ఫొటో దిగిన ముగ్గురు చిన్నారులు ఇప్పుడు మన మధ్యలేరు, వీరి కుటుంబసభ్యులు సైతం ఇటీవల జరిగిన అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు అని మిస్ వరల్డ్ ఓపల్ సుచాత భావోద్వేగానికి లోనయ్యారు.