సమాజంలో అవమానకరంగా ఉన్న పలు కులాల పేర్లను మార్చాలని, సంచార జాతుల అభివృద్ధికి ప్రత్యేక చర్యలు చేపట్టాలని తెలంగాణ బీసీ కమిషన్ చేసిన సిఫారసులను రాష్ట్ర మంత్రివర్గం ఆమోదించింది. దొమ్మర, పిచ్చిగుంట్ల వంటి పేర్ల స్థానంలో గడవంశీయ, వంశరాజ్ వంటి గౌరవప్రదమైన పేర్లను చేర్చనున్నారు. అలాగే కేంద్ర ప్రభుత్వ సీడ్ పథకం లబ్ధి కోసం 51 కులాలను సంచార జాతులుగా గుర్తించారు. ఈ నిర్ణయం ద్వారా సుమారు 19 లక్షల మందికి ప్రయోజనం చేకూరనుంది.

