హైదరాబాద్ నుంచి బోధన్ వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. మెదక్ జిల్లాలోని కొల్చారం జాతీయ రహదారిపై ధాన్యం లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. క్షతగాత్రులను మెదక్ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు- లారీ ఢీ.. 15మందికి తీవ్రగాయాలు |

