దిల్లీ పేలుడు కుట్రలో కీలక భాగస్వామి అయిన డా. షాహిన్ షాహిద్ జైషే మహమ్మద్ మహిళా విభాగం ‘జమాత్ ఉల్ మొమినాత్’ సభ్యురాలని దర్యాప్తు వర్గాలు ఇప్పటికే స్పష్టం చేశాయి. అయితే ఇప్పటివరకు ఈ విభాగంలో 5000 మందికి పైగా చేరినట్లు తాజా సమాచారం. అక్టోబరు 8 నుంచి జైషే ప్రధాన కార్యాలయంలో ఈ బ్రిగేడ్ కోసం నియామకాలు ప్రారంభించినట్లు నిఘా వర్గాలు గుర్తించాయి. అయితే జైషేలో పురుష ఉగ్రవాదుల తరహాలోనే వీరికి కూడా కఠిన శిక్షణ ఇస్తున్నట్లు తెలుస్తోంది.

