మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో ఇరాన్ భీకర దాడులకు తెగబడింది. శనివారం (మార్చి 21) హిందూ మహాసముద్రంలోని అమెరికా, బ్రిటన్ల సైనిక స్థావరమైన డియెగో గార్సియాపై రెండు బాలిస్టిక్ క్షిపణులను ప్రయోగించింది. ఈ దాడి జరిగిన వెంటనే దుబాయ్లో భారీ పేలుడు శబ్దాలు వినిపించాయి. వాల్ స్ట్రీట్ జర్నల్ కథనం ప్రకారం, ఇరాన్ భూభాగానికి సుమారు 4,000 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ స్థావరంపై జరిగిన దాడుల్లో ఇది అతిపెద్దది. అత్యంత అరుదైనది.రెండు క్షిపణులను గగనతలంలోనే కూల్చివేసినట్లు అమెరికా అధికారులు ధృవీకరించారు.

