భారత జట్టు ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్ను గెలుచుకుంది. శుక్రవారం ఇంగ్లాండ్పై భారత జట్టు 100 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్లో జరిగిన ఈ మ్యాచ్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. 412 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. కాలేబ్ ఫాల్క్నర్ 115 పరుగులు చేశాడు.

