loader

ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదు.. మాకు అండగా నిలవండి.. కరాచీ బేకరీ యజమానుల ఆవేదన

భారత్, పాకిస్తాన్ ఉద్రిక్తతల నడుమ కరాచీ బేకరీపై దాడి జరిగింది. బజరంగ్‌దళ్ కార్యకర్తలు బేకరీ ఫర్నీచర్ ధ్వంసం చేసి, పేరు మార్చాలని హెచ్చరించారు. ఈ దాడులపై కరాచీ బేకరీ యజమాని వారసులు మీడియాతో మాట్లాడారు. ఈ కష్ట సమయంలో  అండగా ఉండాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, డీజీపీ, కమిషనర్‌లను కోరారు. తాము హైదరాబాద్‌కు చెందిన వారమని.. ఇది పాకిస్తాన్ బ్రాండ్ కాదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. నిజమైన భారతీయ బ్రాండ్ కాబట్టి.. సాధారణ ప్రజలు […]

హైదరాబాద్ వాసులకు ఈ యాప్ గురించి తెలుసా..?

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ) పరిధిలోని ప్రజలకు అనేక రకాల పౌర సేవలను సులభంగా అందించేందుకు ‘మైజీహెచ్‌ఎంసీ’ అనే ప్రత్యేక మొబైల్ అప్లికేషన్‌ను అందుబాటులోకి తెచ్చినట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ తెలిపారు. ఈ యాప్ ద్వారా పారిశుద్ధ్య నిర్వహణ, ఇంజినీరింగ్ సంబంధిత పనులు, ప్రజారోగ్య సమస్యలు, వీధి దీపాల నిర్వహణ, మురుగునీటి వ్యవస్థ సమస్యలు, రహదారుల శుభ్రత వంటి అనేక అంశాలపై ఫిర్యాదులు చేయవచ్చునన్నారు.

ఎలివేటెడ్‌పై మరోసారి గ్రామసభలు

ఎలివేటేడ్‌ కారిడార్‌ భూసేకరణపై గ్రామసభలు నిర్వహించేందుకు అధికారులు సిద్ధం అవుతున్నారు. ప్యారడైజ్‌ నుంచి శామీర్‌పేట్‌ రింగ్‌రోడ్డు వరకు 18 కిలోమీటర్ల మేర నిర్వహించనున్న కారిడార్‌ నిర్మాణానికి  భూ సేకరణ పక్రియకు ఓ వైపు రక్షణ శాఖ కొర్రీలు, మరోవైపు స్థానికుల వ్యతిరేకతతో బ్రెక్‌ పడిన విషయం విదితమే. భూ సేకరణ పక్రియపై ఇదివరకు ప్రభుత్వం నిర్వహించిన గ్రామసభలను గ్రామస్తులు బహిష్కరించి న్యాయస్థానాలను ఆశ్రయించారు. తిరిగి ఈనెల 9న గ్రామాలకు సంబంధించిన గ్రామసభను లోతుకుంటలో రెవెన్యూ అధికారులు నిర్వహించనున్నట్లు […]

అందాల పోటీల సందడి షురూ.. భాగ్యనగరానికి చేరుకుంటున్న అందగత్తెలు..

తెలంగాణలో అందాల పోటీల హడావుడి ప్రారంభమైంది పలు దేశాల అందగత్తెలు హైదరాబాద్ నగరానికి చేరుకుంటున్నారు. వారికి నిర్వాహకులు ఘన స్వాగతం పలుకుతున్నారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న మిస్‌ వరల్డ్ పోటీలకు అంతా సిద్ధమైంది. వివిధ దేశాల సుందరీమణులు హైదరాబాద్‌కు చేరుకుంటున్నారు కెనడా నుంచి శంషాబాద్‌ ఎయిర్‌పోర్టుకు చేరుకున్న మిస్‌ కెనడా క్యాథరన్‌ మోరిసన్‌కు ఘనస్వాగతం లభించింది. యువతులు సంప్రదాయ నృత్యాలు చేస్తుండగా తెలంగాణ సంప్రదాయం ప్రకారం హారతి పట్టి, నుదుట బొట్టుపెట్టి, మెడలో పూలమాల […]

బాధితులకు అండగా జాతీయ మహిళా కమిషన్‌

గృహ హింస, లైంగిక, లైంగిక వేధింపులు, సైబర్‌ క్రైమ్‌ బాధిత మహిళలకు జాతీయ మహిళా కమిషన్‌ అండగా నిలుస్తుందని చైర్‌పర్సన్‌ విజయ రహత్కర్‌ అన్నారు. సోమవారం బేగంపేటలోని టూరిజం ప్లాజా సమగం హాల్‌ లో ఏర్పాటు చేసిన మహిళా జన్‌ సున్వాయి( బహిరంగ విచారణ)లో ఆమె పాల్గొని కేసులు పరిష్కరించారు. హైదరాబాద్‌ లో కమిషన్‌ మొదటగా ఏర్పాటు చేసి మహిళా బాధితుల నుంచి 60 దరఖాస్తులు స్వీకరించామని తెలిపారు. మహిళల సమస్యలను సత్వరం పరిష్కరించడానికి కమిషన్‌ నేరుగా […]

నగరంలో పాకిస్థానీయులు

పహల్గాం ఉగ్రవాద దాడి నేపథ్యంలో సిటీలో పోలీసులు హైఅలర్ట్‌ ప్రకటించారు. సున్నిత ప్రాంతాలపై దృష్టి పెట్టడంతో పాటు హైదరాబాద్‌లో ఉన్న పాకిస్తానీయులను వెనక్కు పంపడంపై కేంద్రం నుంచి ఆదేశాలు వచ్చిన కారణంగా వారి వివరాలపై ఆరాతీస్తున్నారు. లాంగ్‌టర్మ్‌ వీసా కలిగినవాళ్లు 156 మంది ఉన్నారు. ఇక్కడి వారిని వివాహం చేసుకున్న వారితో పాటు వారి రక్త సంబంధీకులకు ఈ వీసాలు జారీ చేస్తూ ఉంటారు. మరో 13 మంది విజిట్‌, బిజినెస్‌ వీసాలు(షార్ట్‌ టర్మ్‌)వీసాలు కలిగి ఉండగా, […]

పీకల్లోతు నష్టాల్లో హైదరాబాద్ మెట్రో.. ఏకంగా రూ.6,598 కోట్లు లాస్..!

హైదరాబాద్ ప్రజల జీవనశైలిలో ఓ భాగమైన హైదరాబాద్ మెట్రో రైల్ (HMRL) ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందిస్తున్నప్పటికీ, ఆర్థికంగా మాత్రం తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎల్ అండ్ టీ సంస్థ సారథ్యంలో నడుస్తున్న ఈ ప్రజా రవాణా వ్యవస్థ ప్రారంభం నుంచే నష్టాల బాటలో పయనిస్తోంది. 2024-25 ఆర్థిక సంవత్సరం మధ్యంతర కాలంలో హైదరాబాద్ మెట్రో రైలు ఏకంగా రూ.625 కోట్ల నష్టాన్ని చవిచూసింది. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలోనూ పరిస్థితి ఏమీ మారలేదు. అప్పుడే […]

వనం వదిలి జనంలోకి.. HCUలో బుల్డోజర్లతో బెదిరిన జీవాలు

హెచ్‌సీయూ కంచ గచ్చిబౌలిలో ప్రశాంతంగా బతికిన మూగజీవాలు నేడు ప్రాణభయంతో పరుగులు తీస్తున్నాయి. చెట్లను, ఆవాసాలను బుల్డోజర్లు నేలమట్టం చేస్తుంటే బెదిరిన జింకలు గమ్యం ఎటో తెలియకుండా పరుగులు తీస్తున్నాయి. దీంతో వివిధ ప్రాంతాల్లో జింకలు సంచరిస్తూ కనిపిస్తున్నాయి. శుక్రవారం గోపన్‌పల్లి, ఎన్టీఆర్‌ నగర్‌లో ఓ జింక హృదయవిదారకంగా తిరుగుతూ కనిపించింది. రహదారిపై ఉన్న పలు షాపుల్లోకి వెళ్తూ, బయటకు వస్తూ భయపడుతూ నిపించింది. ఎన్టీఆర్‌ నగర్‌ ప్రధాన రహదారిపై పరుగెత్తగా వీధి కుక్కలు వెంటపడ్డాయి. స్థానికులు […]

హెచ్‌సియులో హైకోర్టు రిజిస్ట్రార్

సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు గురువారం ఉదయం హైకోర్టు రిజిస్ట్రార్ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో భూములను పరిశీలించారు. దాదాపుగా ఐదు కిలోమీటర్ల కాలినడకన పర్యటించి వివరాలు సేకరించారు. దాదాపు నాలుగైదు గంటల పాటు రిజిస్ట్రార్ హెచ్‌సియు భూములకు సంబంధించిన వివరాలు క్షుణ్ణంగా పరిశీలించారు. యూనివర్సిటీ విద్యార్థులు, ప్రొఫెసర్లు, విద్యార్థి సంఘాల నాయకులు రిజిస్ట్రార్‌ను కలిసి వర్సిటీలో ధ్వంసమైన భూమిని చూపించారు. అన్ని వరాలు సేకరించి విశ్లేషించి హైకోర్టు రిజిస్ట్రార్ నివేదిక రూపొందించి సుప్రీంకోర్టుకు సమర్పించారు.

న్యాక్‌ ఇంజినీర్లపై వేటు

జీహెచ్‌ఎంసీలో 27 మంది నేషనల్‌ అకాడమీ ఆఫ్‌ కన్‌స్ట్రక్షన్స్‌(న్యాక్‌) ఇంజినీర్లపై వేటు వేస్తూ జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఇలంబర్తి ఆదివారం ఉత్తర్వులు జారీచేశారు. అక్రమ నిర్మాణాల విషయంలో న్యాక్‌ ఇంజినీర్లు డబ్బులు తీసుకున్నట్లు కమిషనర్‌కు పలువురు బాధితులు స్వయంగా ఫిర్యాదు చేశారు. విజిలెన్స్‌ విభాగాన్ని రంగంలోకి దింపి సమగ్ర విచారణకు ఆదేశాలు జారీశారు. జీహెచ్‌ఎంసీ వ్యాప్తంగా 100 మంది న్యాక్‌ ఇంజినీర్లు ఉండగా, ప్రధానంగా 27 మంది అవినీతికి పాల్పడినట్లు విచారణలో తేలింది. ఈ మేరకు విధుల నుంచి తొలగిస్తూ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON