loader

యుద్దం వేళ అమెరికాకు బిగ్ షాక్.. ఆయుధాల ఎగుమతులను నిలిపివేసిన ఐరోపా దేశం!

మధ్యప్రాచ్యంలో కొనసాగుతున్న యుద్ధం నేపథ్యంలో అమెరికాకు బిగ్ షాక్ తగిలింది. అగ్రరాజ్యానికి ఆయుధాల ఎగుమతులను స్విట్జర్లాండ్ నిషేధించింది. రాజకీయ సంఘర్షణలో తమ తటస్థ వైఖరిని తెలియజేస్తూ, పశ్చిమ ఆసియాలో యుద్ధం కొనసాగుతున్నంత కాలం ఆయుధాల ఎగుమతులను అనుమతించబోమని స్విట్జర్లాండ్ పేర్కొంది. ఈ చర్య అమెరికాకు ఆయుధ సరఫరాలపై ప్రభావం చూపవచ్చంటున్నారు రక్షణ రంగ నిపుణులు.  గతంలో ఇరాక్ యుద్ధ సమయంలో కూడా స్విట్జర్లాండ్ తన తటస్థ వైఖరి కారణంగా అమెరికాకు ఆయుధాల ఎగుమతులను నిలిపివేసింది.

బ్రిటన్ వీసా ఛారీల పెంపు.. ఏప్రిల్ 8 నుంచి అమలోకి

పర్యాటకులతో పాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులపైనా ఇకపై మరింత ఆర్థిక భారం పడనుంది. స్టూడెంట్, విజిటర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది. వీసా, సెటిల్మెంట్, స్పాన్సర్ లైసెన్స్ ఫీజుల కొత్త ఛార్జీలు ఏప్రిల్ 8 నుంచి అమల్లోకి రానున్నాయి. విద్యార్థి వీసా రుసుములు 524 పౌండ్ల నుంచి 558 (రూ.69,814) పౌండ్లకు పెరగనున్నాయి. మూడేళ్ల స్కిల్డ్ వర్కర్ (కార్మిక) వీసా 769 పౌండ్ల నుంచి 819 […]

ఇరాన్ పై ముప్పేట దాడి- కలిసివచ్చిన ఆరు దేశాలు

ఇరాన్ యుద్ధం నేపథ్యంలో హార్ముజ్ జలసంధి గుండా సురక్షిత రవాణా ప్రయత్నాలకు బ్రిటన్, ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ, నెదర్లాండ్స్, జపాన్ సిద్ధంగా ఉన్నామని ప్రకటించాయి. ఈ విషయంలో అమెరికా, ఇజ్రాయెల్ తో కలిసి పని చేయడానికి సంసిద్ధతను వ్యక్తం చేశాయి. గల్ఫ్‌లో వివిధ దేశాల కార్గో సిప్ లపై ఇరాన్ దాడులు చేయడాన్ని ఆయా దేశాలు తప్పుపట్టాయి. నిరాయుధ వాణిజ్య నౌకలపై దాడులు చేయడం సరికాదని తేల్చి చెప్పాయి.

కువైట్ చమురు శుద్ధి కర్మాగారంపై డ్రోన్ దాడి: రగిలిన మంటలు

కువైట్‌లోని అతిపెద్ద చమురు శుద్ధి కర్మాగారాల్లో ఒకటైన మినా అల్-అహ్మది పై గురువారం తెల్లవారుజామున డ్రోన్ దాడి జరిగింది. ఈ దాడి కారణంగా ప్లాంట్‌లో భారీగా మంటలు చెలరేగాయి కువైట్ పెట్రోలియం కార్పొరేషన్‌కు చెందిన మినా అల్-అహ్మది రిఫైనరీ. పేలుడు పదార్థాలతో కూడిన డ్రోన్ల ద్వారా ఈ దాడి జరిగినట్లు ప్రాథమిక సమాచారం. ఈ ప్లాంట్ రోజుకు సుమారు 7,30,000 బ్యారెళ్ల పెట్రోలియంను ఉత్పత్తి చేస్తుంది సరఫరాలో అంతరాయం ఏర్పడితే ముడి చమురు ధరలు మరింత పెరిగే […]

బ్యాంకింగ్ రంగంలో ఏఐ ప్రకంపనలు.. 20,000 ఉద్యోగాల కోతకు HSBC సిద్ధం!

ప్రపంచంలోని అతిపెద్ద బ్యాంకింగ్ మరియు ఆర్థిక సేవల సంస్థలలో ఒకటైన హెచ్ఎస్‌బీసీ హోల్డింగ్స్ పిఎల్‌సి (HSBC Holdings Plc), రాబోయే సంవత్సరాల్లో భారీ ఎత్తున ఉద్యోగాల కోతకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. సుమారు 20,000 మంది ఉద్యోగులపై ఈ నిర్ణయం ప్రభావం చూపవచ్చని బ్లూమ్‌బెర్గ్ నివేదిక వెల్లడించింది. ఏఐ ఆధారిత పరివర్తన ద్వారా బ్యాంక్ నిర్వహణ ఖర్చులను తగ్గించుకోవాలనే వ్యూహంలో భాగంగా ఈ చర్యలు తీసుకోనున్నారు.

డెల్‌లో 11 వేల మంది ఉద్యోగులపై వేటు

యూఎస్‌కు చెందిన ప్రముఖ టెక్‌ కంపెనీ డెల్‌ టెక్నాలజీస్‌ ఈ ఏడాది కూడా తన ఉద్యోగుల తొలగింపును కొనసాగిస్తున్నది. 2026 ఆర్థిక సంవత్సరంలో తన గ్లోబల్‌ వర్క్‌ ఫోర్స్‌లో దాదాపు 11,000 మందిని నిశ్శబ్దంగా తగ్గించుకుంది.కంపెనీ దాఖలు చేసిన 10-కే ఫైలింగ్‌లో మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మందిని తగ్గించినట్టు వెల్లడించింది.ఉద్యోగుల తెగదెంపుల ప్యాకేజీ కోసం 569 మిలియన్‌ డాలర్లు ఖర్చు చేసినట్టు తన ఫైలింగ్‌లో పేర్కొన్నది.

ఇక ప్రతీ ఒక్కరిపైనా వార్ ఎఫెక్ట్..! ప్రపంచదేశాలకు ఇరాన్ వార్నింగ్..!

ఇరాన్ పై అమెరికా-ఇజ్రాయెల్ మొదలుపెట్టిన యుద్దం మూడు వారాలకు చేరుతోంది. ఇరాన్ జాతీయ భద్రతా మండలి ఛీఫ్ అలీ లారిజానీని ఇజ్రాయెల్ దాడుల్లో కోల్పోయిన ఇరాన్ తాజాగా ప్రపంచ దేశాలకు కీలక హెచ్చరికలు చేసింది. పశ్చిమ ఆసియా సంక్షోభం యొక్క పరిణామాలు ప్రపంచవ్యాప్తంగా అందరినీ తాకబోతున్నాయని ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాఘ్చి హెచ్చరించారు. ఇరాన్‌పై యుద్ధం అన్యాయమైనదని యూరోపియన్, అమెరికా అధికారులతో సహా పెద్ద సంఖ్యలో గళాలు వినిపిస్తున్నాయని, అంతర్జాతీయ సమాజంలోని ఇతర సభ్యులు కూడా […]

IRGC ఆఫీస్ ధ్వంసం- టెహ్రాన్‌పై భారీ దాడులు చేస్తున్నాం: ఇజ్రాయెల్

ఇరాన్ రాజధాని టెహ్రాన్‌పై భారీ దాడులు చేస్తున్నామని ఇజ్రాయెల్ తెలిపింది. సైనిక మౌలిక సదుపాయాలు సహా కార్యాలయాల లక్ష్యంగా దాడులు చేస్తున్నామని వెల్లడించింది. ఇరాన్ రివల్యూషనరీ గార్డ్ కోర్ నేవీ ప్రధాన కార్యాలయాన్ని ధ్వంసం చేసినట్లు IDF ఎక్స్‌లో పోస్టు చేసింది. పౌర నౌకలపై ఉగ్రదాడులకు IRGC నేవీ కారణమని ఆరోపించింది. ఇరాక్‌, లెబనాన్‌, యెమెన్‌లోని మిలిటెంట్ సంస్థలకు సముద్ర మార్గం ద్వారా ఆయుధాలు సరఫరా చేసిందని తెలిపింది

ఇజ్రాయెల్ దాడులతో ఇరాన్ అధ్యక్షుడి విమానం ధ్వంసం

ఇరాన్‌పై ఇజ్రాయెల్ మరోసారి విరుచుకుపడింది. టెహ్రాన్‌లోని మెహ్రాబాద్ విమానాశ్రయంలో ఇరాన్ అగ్ర నాయకత్వం ఉపయోగించే ఒక కీలక విమానాన్ని ధ్వంసం, పలు సైనిక స్థావరాలను చేసినట్లు సోమవారం ప్రకటించింది.ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని పరిమితం చేయడమే లక్ష్యంగా ఈ దాడి జరిపినట్లు తెలిపింది. ధ్వంసమైన విమానం ఎయిర్‌బస్ ఏ340. దీనిని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్, గతంలో సుప్రీం లీడర్ అలీ ఖమేనీ వంటి అగ్ర నాయకులు దేశీయ, అంతర్జాతీయ ప్రయాణాల కోసం ఉపయోగించేవారు.

ట్రావిస్ కలానిక్ ‘Atoms’: ఇండస్ట్రియల్ రోబోటిక్స్‌లో కొత్త శకం

ఉబర్ సహ వ్యవస్థాపకుడు, మాజీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) ట్రావిస్ కలానిక్ “ఆటమ్స్” (Atoms) అనే కొత్త ఇండస్ట్రియల్ రోబోటిక్స్ వెంచర్‌ను ప్రారంభించారు. ఈ వెంచర్ ఎనిమిది సంవత్సరాలుగా రహస్యంగా పనిచేస్తోందని, ఇప్పటికే వేలాది మంది సిబ్బందిని నియమించిందని కలానిక్ వెల్లడించారు. ఈ కొత్త ఇండస్ట్రియల్ రోబోటిక్స్ వెంచర్ స్టార్టప్ మైనింగ్, రవాణా, ఆహార రంగాలలో ఆటోమేషన్‌పై దృష్టి సారిస్తుంది. ఆటమ్స్ స్పెషలైజ్డ్  రోబోల సహాయంతో రవాణా, వ్యర్థ పదార్థాల నిర్వహణ, మైనింగ్ వంటి రంగాలలో […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON