loader

తాలిబాన్లతో భీకర ఘర్షణ 12 మంది పాకిస్తాన్ సైనికులు మృతి..

పాకిస్తాన్ ఆఫ్ఘనిస్థాన్ సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం నెలకొంది. ఈ ఘర్షణలో పాక్‌కు చెందిన ఏడు చెక్‌పోస్టుల వెంబడి ఆప్ఘాన్‌ అన్ని వైపుల నుంచి కాల్పులు జరుపుతోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు పాక్‌ సైనికులు మరణించారని ఆఫ్గాన్ చెబుతోంది. మరోవైపు తమ సైన్యం జరిపిన కౌంటర్ ఫైరింగ్ లో పలువురు అఫ్గాన్‌ సైనికులు మృతి చెందారని పాకిస్తాన్ వెల్లడించినట్లు పిటివి న్యూస్ పేర్కొంది

అమెరికాలో భారీ పేలుడు: 19 మంది దుర్మరణం

అమెరికాలోని టెన్నెస్నీ రాష్ట్రం ఓ మిలిటరీ యుద్ద సామాగ్రి ప్లాంట్‌లో భారీ పేలుడు జరిగింది. అక్యూరేట్ ఎనర్జిటిక్ సిస్టమ్స్‌కు చెందిన కర్మాగారంలో ఒక్కసారిగా భారీ పేలుళ్లు చోటుచేసుకోవడంతో 19 మంది మృతి చెందారు. పేలుళ్ల ధాటికి కారు ఎగిరిపడ్డాయి. మంటలు అంటుకోవడంతో కార్లతో పాటు పలు వాహనాలు దగ్ధమయ్యాయి. ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఆకాశంలో దట్టమైన పొగలు వ్యాపించాయి. ఈ పేలుళ్ల కొన్ని కిలో మీటర్ల వరకు వినిపించాయి. పోలీసులు, ఎఫ్‌బిఐ అధికారులు ఘటనా స్థలానికి చేరుకొని […]

అట్టుడికిపోతున్న పాకిస్తాన్.. ఇస్లామాబాద్ సహా అనేక నగరాల్లో హింసాత్మక నిరసనలు!

పాకిస్తాన్‌లో మళ్లీ భారీ హింస చెలరేగింది. గాజాలో ఇజ్రాయెల్‌ దాడులకు నిరసనగా TLP సంస్థ చేపట్టిన ర్యాలీల్లో అల్లర్లు చెలరేగాయి. ఆందోళనకారులు పోలీసులపైకి రాళ్లు రువ్వారు. లాహోర్‌ , ఇస్లామాబాద్‌ , పెషావర్‌, క్వెట్టాతో సహా పలు ప్రాంతాల్లో హింస చెలరేగింది. ఇస్లామాబాద్‌లో అమెరికా ఎంబసీ ముట్టడికి ఆందోళనకారులు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. లాహోర్‌లో పోలీసు కాల్పుల్లో ఇద్దరు చనిపోయారు. పలువురికి తీవ్రగాయాలయ్యాయి. ఐదుగురు పోలీసులు కూడా గాయపడ్డారు. పలు చోట్ల పోలీసులు నిషేధాజ్ఞలు విధించారు. ఇంటర్నెట్‌ను […]

నోబెల్ బహుమతి వచ్చిన వెనిజులా ఐరన్ లేడీని ప్రశంసించిన ట్రంప్‌- వైరల్ అవుతున్న పోస్ట్‌

మరియా కొరినా మచాడో పేరును చాడో పేరును నోబెల్ శాంతి బహుమతికి ఎంపిక చేసింది. మరియా కొరినా మచాడో గురించి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాత ప్రకటన ఒకటి వైరల్ అవుతోంది. జనవరి 2025లో వెనిజులా ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిరసనలు నిర్వహించినందుకు మరియా కొరినాను ట్రంప్ ప్రశంసించారు. “నార్వేజియన్ నోబెల్ కమిటీ వెనిజులా ప్రజల కోసం ప్రజాస్వామ్య హక్కులను ప్రోత్సహించడానికి, నియంతృత్వం నుంచి ప్రజాస్వామ్యంలోకి న్యాయబద్ధమైన, శాంతియుత మార్పు కృషికి మరియా కొరినా మచాడోకు 2025 […]

వెనిజులా ఎంపీ మరియా కొరినా మచాడోకు నోబెల్ శాంతి బహుమతి

ప్రపంచంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన నోబెల్ పురస్కారాల ప్రకటన కొనసాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా నోబెల్ శాంతి బహుమతి ప్రకటించారు. మరియా కొరినా మచాడో కు ఈ ఏడాదికి సంబంధించిన నోబెల్ శాంతి పురస్కారం వరించింది. మరియా కొరినా మచాడో వెనిజులా పార్లమెంట్ సభ్యురాలు. వెనిజులా ప్రజల కోసం మరియా కొరినా మచాడో చేసిన అవిశ్రాంత కృషి, వారి హక్కుల కోసం చేసిన పోరాటం ఫలితంగానే ఆమెకు ఈ నోబెల్ బహుమతి దక్కినట్లు నార్వేజియన్ నోబెల్ కమిటీ వెల్లడించింది.

సాహిత్యంలో హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కైకు నోబెల్

హంగేరియన్ రచయిత లాస్లో క్రాస్నాహోర్కై, సాహిత్యంలో విశేష కృషి చేసినందుకు గాను ఈ ఏడాది ప్రతిష్ఠాత్మక నోబెల్ పురస్కారం పొందారు. హంగేరీకి చెందిన ఇతను జనవరి 5, 1954లో జన్మించారు. 

భారత్-యూకేల మధ్య వాణిజ్య ఒప్పందం

బ్రిటన్ ప్రధాని కీర్ స్టార్మర్ ప్రస్తుతం భారత్‌లో పర్యటిస్తున్నారు. ఈ పర్యటన అనేది గతంలో కుదిరిన భారత్-యూకే స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ద్వారా ఇప్పుడు పర్యటిస్తున్నారు. కీర్ స్టార్మర్ ముంబైలోని వైఆర్‌ఎఫ్‌ స్టూడియోను సందర్శించారు. ర్‌ స్టార్మర్‌ పర్యటన సందర్భంగా యశ్‌రాజ్‌ ఫిల్మ్స్‌ సంస్థ 2026 నుంచి తమ మూడు పెద్ద సినిమాలను యునైటెడ్ కింగ్‌డమ్‌ (యూకే) లోని లొకేషన్లలో చిత్రీకరించనున్నట్లు ప్రకటించింది.

ముగిసిన ఇజ్రాయిల్, హమాస్ యుద్ధం.. గాజాలో శాంతి పవనాలు వీచినట్టేనా..!

గాజా మొదటి దశ శాంతి ఒప్పందానికి ఇజ్రాయెల్‌, హమాస్‌లు అంగీకరించినందుకు గర్వంగా ఉందన్నారు అమెరిక అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. ఈ నిర్ణయంతో హమాస్‌ చేతిలో బందీగా ఉన్న వారందరూ త్వరలోనే విడుదల అవుతారన్నారు. ఇజ్రాయెల్‌ తన బలగాలను వెనక్కి తీసుకుంటుందని తెలిపారు. దీర్ఘకాలికమైన శాంతిని సాధించే క్రమంలో సైనికుల ఉపసంహరణ తొలి అడుగుగా నిలిచిపోతుందన్నారు ట్రంప్‌. ఈ మేరకు తన సోషల్‌ మీడియా ట్రూత్‌లో పోస్టు చేశారు. రెండేళ్ల గాజా యుద్ధాన్ని ముగింపు పలికేందుకు ఇదొక అపూర్వ […]

వాట్సాప్ కు పోటీగా అరట్టై డౌన్లోడ్ చేసేముందు ఇవి తెలుసుకొండి

అరట్టైలో ఎలాంటి మొబైల్ నంబర్ లేకుండా చాట్ చేయవచ్చు. ప్రత్యేక మీటింగ్స్ కూడా క్రియేట్ చేయవచ్చు. ఇది స్లో ఇంటర్నెట్‌లో కూడా బాగా పనిచేస్తుంది. ముఖ్యమైన మెసేజ్‌లు, ఫోటోలు, వీడియోలను క్లౌడ్‌లో సురక్షితంగా సేవ్ చేస్తుంది. అంటే పొరపాటున డిలీట్ అయిన సమాచారాన్ని తిరిగి పొందవచ్చు. ప్రస్తుతం ‘అరట్టై’ యాప్‌లో కొన్ని ఫీచర్లు లేవు. చాట్‌లను లాక్ చేయడం, డిజప్పియరింగ్ మెసేజ్‌లు, చాట్ ఎక్స్‌పోర్ట్, ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ లాంటివి ఇందులో అందుబాటులో లేవు.

రసాయన శాస్త్రంలో ముగ్గురికి నోబెల్ పురస్కారం…

2025 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ పురస్కారాన్ని ముగ్గురుకి ప్రకటించారు. రసాయన శాస్త్రంలో మెటల్ ఆర్గానిక్ ఫ్రేమ్ వర్క్ అభివృద్ధి చేసినందుకు గానూ ముగ్గురికి నోబెల్ పురస్కారం ప్రకటించారు. సుసుము కిటాగావా, రిచర్డ్ రాబ్సన్, ఒమర్ ఎం యాఘీలను ఈ ఏడాది నోబెల్ పురస్కారం వరించింది. వీరు కొత్తరకం మాలిక్యూలర్ ఆర్కిటెక్చర్ అభివృద్ధి చేసినట్లు, రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ తెలిపింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON