loader

భారత్​లో 5జీ యూజర్లు 40 కోట్లు- జ్యోతిరాదిత్య సింధియా

ప్రపంచంలో 5జీ నెట్​వర్క్​ వినియోగంలో భారత్​ రెండో అతిపెద్ద దేశంగా నిలిచిందని భారత కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. “40 కోట్లకు పైగా 5G వినియోగదారులతో, భారత్​ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G చందాదారుల స్థావరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఈ సాంకేతికతను స్వీకరిస్తున్న దేశాలలో ఒకటిగా నిలిచింది. 110 కోట్ల యూజర్లతో చైనా మొదటి స్థానంలో నిలువగా, 35 కోట్ల వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది.

ఇజ్రాయెల్‌లో భారీ భూకంపం.. అణు పరీక్షలపై అనుమానం?

ఇజ్రాయెల్‌లో గురువారం భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్‌ స్కేల్‌పై 4.2 తీవ్రతతో నమోదైంది. ఈ భూకంపం ప్రభావం వల్ల ఎలాంటి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు.  డొమినాకు సమీపంలో 10 కిలోమీటర్ల లోతులో ఈ భూకంప కేంద్రం ఉన్నట్లు యూరోపియన్-మధ్యధరా భూకంప కేంద్రం వెల్లడించింది. ఇజ్రాయెల్‌లోని జెరూసలేం, బీర్షెబా వంటి నగరాల్లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. ఇజ్రాయెల్ రహస్యంగా నిర్వహించిన అణ్వాయుధా పరీక్షల ఫలితమని సోషల్ మీడియాలో ప్రచారం నడుస్తోంది.

ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు పెట్టుకోకండి.. ఇండియన్స్‌కు కీలక సూచన

ఇజ్రాయెల్ – ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో ఉన్న భారతీయులు అప్రమత్తంగా ఉండాలని భారత ప్రభుత్వం సూచించింది. ఈ మేరకు ఇజ్రాయెల్‌లోని భారత రాయబార కార్యాలయం మార్గదర్శకాలను జారీ చేసింది. ఇజ్రాయెల్ అధికారులు, హోం ఫ్రంట్ కమాండ్ జారీ చేసిన భద్రతా మార్గదర్శకాలను, నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. అలాగే తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు ఇజ్రాయెల్‌కు ప్రయాణాలు పెట్టుకోవద్దని స్పష్టం చేసింది.

థ్యాంక్యూ మారియా.. నోబెల్ శాంతి పురస్కారం ఇచ్చిన మచాడోపై ట్రంప్ ప్రశంసలు

వెనెజువెలా ప్రతిపక్ష నాయకురాలు మరియా కొరీనా మచాడో అందజేసిన నోబెల్ శాంతి పురస్కారంపై అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ స్పందించారు. మచాడోకు కృతజ్ఞతలు చెప్పిన ట్రంప్..దీనిపై ట్రంప్ తన సోషల్‌మీడియా ఖాతా ద్వారా స్పందించారు. మచాడోను కలవడం గొప్ప గౌరవంగా ఆయన భావిస్తున్నానని తెలిపారు. ఆమె చాలా గొప్ప మహిళ అని పొగిడారు. నేను చేస్తున్న పనికి గుర్తింపు ఆమె తనకు వచ్చి నోబెల్ శాంతి పురస్కారాన్ని నాకు సమర్పించారు అని వెల్లడించారు.

సరిహద్దు వెంబడి మరోసారి పాక్‌ కుట్రలు! 15 డ్రోన్లు కూల్చేసిన ఇండియన్‌ ఆర్మీ

సరిహద్దులో పాకిస్తాన్‌ కుట్రలు కొనసాగుతున్నాయి. LOC దగ్గర పాకిస్తాన్‌ డ్రోన్ల సంచారం తీవ్ర కలకలం రేపుతోంది. సరిహద్దు గ్రామాల్లో గత కొద్దిరోజులుగా పాకిస్తాన్‌ డ్రోన్లు ఆయుధాలతో పాటు డ్రగ్స్‌ను జారవిడుస్తున్నాయి. ఆర్మీ అధికారులు వెంటనే యాంటీ డ్రోన్‌ సిస్టమ్‌ను యాక్టివేట్‌ చేసి వాటిని ధ్వంసం చేస్తున్నారు. ఈ క్రమంలోనే తాజాగా మూడోసారి ఆర్మీ డ్రోన్లు కనిపించడం కలకలం రేపింది. నియంత్రణ రేఖ (ఎల్‌ఓసి) సమీపంలోని పూంచ్‌లోని దేగ్వార్ ప్రాంతంలో కొన్ని అనుమానిత పాకిస్తాన్ డ్రోన్‌లను గుర్తించిన భారత […]

ఇరాన్‌ అల్లర్లు- భారతీయులను తీసుకొచ్చేందుకు సిద్ధమైన కేంద్రం

ఇరాన్ నుంచి భారతీయులను తరలించేందుకు కేంద్రం సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. తొలి బృందాన్ని శుక్రవారం భారత్‌కు తీసుకొచ్చే అవకాశం ఉందని సమాచారం. ప్రయాణానికి అవసరమైన పత్రాలను సిద్ధంగా ఉంచుకోవాలని టెహ్రాన్‌లోని భారత్‌ ఎంబసీ అధికారులు, విద్యార్థులను కోరినట్లు తెలుస్తోంది. అనేక ప్రాంతాల్లో ఇంటర్నెట్ సర్వీసుల నిలిపివేత కారణంగా భారతీయులను సంప్రదించేందుకు ఇబ్బందిగా ఉందని పేర్కొంది. అయితే ఇరాన్‌లో దాదాపు 10వేల మంది భారతీయులు ఉన్నట్లు అంచనా.

‘నాటో’లో సంచలన పరిణామం : గ్రీన్‌లాండ్‌‌కు రక్షణగా ఐరోపా ఆర్మీ

నాటో సైనిక కూటమిలో సంచలన పరిణామం చోటుచేసుకుంది. అమెరికా బారి నుంచి డెన్మా‌ర్క్‌లోని గ్రీన్‌లాండ్‌‌ ద్వీపానికి భద్రత కల్పించేందుకు ఐరోపా దేశాల సేనలు రంగంలోకి దిగాయి. అణ్వస్త్ర దేశం ఫ్రాన్స్‌తో పాటు జర్మనీ, నార్వే, స్వీడన్ సహా వివిధ ఐరోపా దేశాల సైన్యాలను గ్రీన్‌లాండ్‌ గడ్డపై మోహరించే ప్రక్రియ మొదలైంది. ప్రపంచంలోనే అతిపెద్ద ద్వీపం గ్రీన్‌లాండ్‌ను మర్యాదగా తమకు విక్రయించకుంటే, స్వాధీనం చేసుకుంటామని డెన్మార్క్‌ను అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇటీవలే హెచ్చరించారు.

అమెరికా- గ్రీన్‌లాండ్ వివాదం: స్వాధీనానికి కుదరదని డెన్మార్క్ స్పష్టం

గ్రీన్‌లాండ్‌ను అమెరికా స్వాధీనం చేసుకునే ప్రశ్నే లేదని డెన్మార్క్, గ్రీన్‌లాండ్ దేశాలు మరోసారి స్పష్టం చేశాయి. అయితే ఆర్కిటిక్ ప్రాంత భద్రతపై అమెరికా వ్యక్తం చేస్తున్న ఆందోళనలను పరిష్కరించేందుకు వాషింగ్టన్‌తో కలిసిహై లెవల్ వర్కింగ్ గ్రూప్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ మేరకు డెన్మార్క్ విదేశాంగ మంత్రి లార్స్ లోక్కే రాస్ముస్సెన్, గ్రీన్‌లాండ్ విదేశాంగ మంత్రి వివియన్ మోట్జ్‌ఫెల్ట్‌లు వాషింగ్టన్‌లోని డెన్మార్క్ ఎంబసీలో సంయుక్తంగా మీడియాతో మాట్లాడారు.

ఇరాన్ గగనతలం మూసివేత – పలు భారతీయ విమాన సర్వీసులు రద్దు

ఇరాన్ గగనతలం మూసివేత నేపథ్యంలో భారతీయ విమానయాన సంస్థలు తమ ప్రయాణికులకు సూచనలు జారీ చేశాయి. ఉద్రిక్తతల దృష్ట్యా కొన్ని విమానాలను దారి మళ్లిస్తున్నామని, మరికొన్ని సర్వీసులను రద్దు చేయాల్సి వచ్చిందని పేర్కొన్నాయి. ప్రయాణికులు ఎప్పటికప్పుడు తామిచ్చే సూచనలు గమనించుకోవాలని ఎయిర్ ఇండియా సోషల్ మీడియాలో తెలిపింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు పేర్కొంది.ఇప్పటికే ఇరాన్‌లో ఉన్న భారతీయులు అందుబాటులో ఉన్న రవాణా మార్గాల్లో దేశాన్ని వీడాలని కేంద్ర ప్రభుత్వం సూచించింది.

‘ఇరాన్‌ నుంచి వెంటనే స్వదేశానికి వచ్చేయండి..’ భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచన

ఇరాన్‌లో ఉన్న భారతీయులకు విదేశాంగశాఖ కీలక సూచనలు చేసింది. ఇరాన్‌ నుంచి వెంటనే స్వదేశానికి  రావాలని కోరింది. ఇరాన్‌ పర్యటనను రద్దు చేసుకోవాలని భారతీయులను కోరింది. ఇరాన్‌పై అమెరికా ఏ క్షణంలోనైనా దాడి చేసే అవకాశం ఉండడంతో విదేశాంగశాఖ కీలక సూచనలు జారీ చేసింది. అల్లర్లు జరుగుతున్న ప్రాంతాలకు భారతీయులు దూరంగా ఉండాలని సూచించారు. నిరసనలతో ఉద్రిక్తంగా మారిన ప్రాంతాలకు దూరంగా ఉండాలని కూడా సూచించింది. నిత్యం తమతో టచ్‌లో ఉండాలని చెప్పింది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON