loader

భారత్ కెనడా మధ్య యురేనియం ఒప్పందం

భారత్‌కెనడా మధ్య సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది.ఈమేరకు రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పౌర అణు ఇంధన కార్యక్రమానికి నిరంతర సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ఉద్దేశం.

ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఖమేనీ భార్య మన్సూరే మృతి

అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, మన్సూర్ ఖోజాస్తే కూడా మరణించడంతో టెహ్రాన్ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి ఉద్రితకలు […]

సౌదీ, బహ్రెయిన్ నేతలకు మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా

ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణలు, డ్రోన్ దాడులపై విరుచుకుపడుతుండటం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ఫోను చేశారు. ఇరువురు నేతలతో సంభాషణల్లో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌పై ఇరాన్ జరుపుతున్న దాడులను మోదీ ఖండించారు. రెండు దేశాల్లోని భారతీయుల […]

సౌదీ ఆరాంకోపై ఇరాన్ డ్రోన్ ఎటాక్​- చమురు శుద్ధి కర్మాగారం మూసివేత

సోమవారం సౌదీ ఆరాంకోకు చెందిన కీలక ఆయిల్ రిఫైనరీపై ఇరాన్ దాడి చేసింది. దీనితో ఆరాంకో తన ‘రాస్​ తనూరా రిఫైనరీ’ని మూసివేసినట్లు ప్రకటించింది. సౌదీ అరేబియాలోని గల్ఫ్​ తీరంలో ఉన్న రాస్​ తనూరా కాంప్లెక్స్​ రోజుకు 5,50,000 బ్యారెల్స్​ సామర్థ్యంతో పశ్చిమాసియాలోనే అతిపెద్ద రిఫైనరీల్లో ఒకటిగా ఉంది. ఇప్పటికే ఇరాన్​ అబుదాబి, దుబాయ్​, దోహా, మనామా సహా ఒమన్​లోని నౌకాశ్రయం దుక్మ్​పై కూడా దాడి చేసింది. UAE, ఒమన్​లోని ప్రధాన షిప్పింగ్ హబ్​లు పూర్తిగా నిలిచిపోయాయి.

అతిపెద్ద ఆయిల్‌ రిఫైనరీపై ఇరాన్‌ డ్రోన్ల దాడి

ఇజ్రాయెల్‌తో పాటు అమెరికా మిత్రదేశాలే లక్ష్యంగా ఇరాన్ భీకర దాడులకు దిగుతోంది. గల్ఫ్ దేశాల్లోని కీలక ప్రాంతాలపై క్షిపణులు, డ్రోన్లతో విరుచుకుపడుతూ యుద్ధ వాతావరణాన్ని సృష్టించింది. ఆర్థికంగా దెబ్బతీసే వ్యూహంతో సౌదీ అరేబియాలోని అతిపెద్ద ఆయిల్ రిఫైనరీని ఇరాన్ డ్రోన్లు లక్ష్యంగా చేసుకున్నాయి. డ్రోన్ల దాడితో రిఫైనరీ వద్ద భారీ ఎత్తున మంటలు చెలరేగినట్లు అంతర్జాతీయ మీడియా సంస్థలు వెల్లడించాయి. ఈ దాడుల ప్రభావంతో గల్ఫ్ ప్రాంతంలో విమాన రాకపోకలు స్తంభించడమే కాకుండా, అంతర్జాతీయ మార్కెట్‌లో చమురు […]

అమెరికాతో చర్చల ప్రసక్తి లేదు: ఇరాన్ సంచలన ప్రకటన

మధ్యప్రాచ్యంలో యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్న వేళ ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. అమెరికాతో ఎలాంటి చర్చలు జరిపే ఉద్దేశ్యం తమకు లేదని ఇరాన్ సెక్యూరిటీ చీఫ్ అలీ లారిజానీ స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన అంతర్జాతీయ వేదికలపై అమెరికా తీరును తీవ్రంగా ఎండగట్టారు. ప్రస్తుతం మిడిల్ ఈస్ట్‌లో నెలకొన్న అశాంతికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనుసరిస్తున్న విధానాలే కారణమని లారిజానీ విమర్శించారు. ఇజ్రాయెల్ మరియు అమెరికా సంయుక్తంగా చేస్తున్న దాడుల నుండి ఇరాన్ తనను […]

నెతన్యాహుతో మోదీ ఫోన్, దాడులు ఆపాలని విజ్ఞప్తి

ఇరాన్ సుప్రీం లీడర్ మరణంతో మధ్యప్రాచ్యంలో ఉద్రిక్త పరిస్థితులు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత ప్రధాని నరేంద్ర మోదీ ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతాన్యు తో ఫోన్‌లో మాట్లాడారు. ప్రస్తుతం కొనసాగుతున్న దాడులపై భారత్‌ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పౌరుల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఉద్రిక్తతలను తగ్గించే దిశగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా వేదిక ‘ఎక్స్’ ద్వారా వెల్లడించారు.

ఇరాన్ ఆపద్ధర్మ నేతగా అయతుల్లా రెజా

ఇరాన్‌లో ఖమేనీ హతంతో వెంటనే ఆయన స్థానంలో తాత్కాలిక సుప్రీంలీడర్‌గా అయతుల్లా అలీ రెజా నియమితులు అయ్యారు. ఇజ్రాయెల్, అమెరికా భీకర దాడులతో దేశ నాయకత్వ శూన్యత ప్రమాదకరం కావడంతో ఈ నియామకం జరిగినట్లు అధికార వర్గాల కథనం ఇస్లామిక్ దేశం అయిన ఇరాన్‌లో అలీరెజా అనుభవజ్ఞుడైన మత పెద్దగా ఉన్నారు. ఖమేనీ హయాంలో పలు కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 67 సంవత్సరాల అలీరెజా ఇరాన్ మత వ్యవహారాల తంతులో ఇప్పుడు సీనియర్ వ్యక్తి.

దుబాయ్ ఎయిర్ పోర్టుపై ఇరాన్ దాడి

దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ జరిపిన భారీ క్షిపణి, డ్రోన్ దాడులతో విమానాశ్రయం లోపలి భాగంలో కొంత నిర్మాణానికి నష్టం వాటిల్లింది. ఈ సంఘటన కారణంగా నలుగురు విమానాశ్రయ ఉద్యోగులు గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. విమానాశ్రయంలో చిక్కుకున్న ప్రయాణికులను సురక్షిత ప్రాంతాలకు తరలించే ప్రక్రియ వేగవంతం చేశారు. దుబాయ్ నగరానికి చిహ్నంగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఏడు నక్షత్రాల హోటల్ ‘బుర్జ్-అల్-అరబ్’పై కూడా ఇరాన్ డ్రోన్లతో దాడికి ప్రయత్నించింది. ఆకాశంలోనే డ్రోన్లను కూల్చివేసినా, వాటి శిథిలాలు పడటంతో […]

వాట్సాప్‌ యూజర్లకు బిగ్‌ అలర్ట్‌..! ఇకపై సిమ్‌ బైండింగ్‌ తప్పనిసరి

భారత ప్రభుత్వం ఆన్‌లైన్ భద్రతను అప్‌గ్రేడ్ చేయడానికి కృషి చేస్తోంది. మార్చి 1 నుండి ప్రభుత్వం కొత్త సిమ్-బైండింగ్ నియమాన్ని అమలు చేస్తోంది. మీరు మీ వాట్సాప్ ఖాతాను మీ ప్రధాన ఫోన్‌లోని భౌతిక సిమ్ కార్డ్‌తో ముడిపడి ఉంచాలి.  సిమ్ బైండింగ్‌తో, మీ సిమ్ ఇప్పటికీ మీ ప్రధాన ఫోన్‌లో ఉందో లేదో చూడటానికి వాట్సాప్ ప్రతి ఆరు గంటలకు తనిఖీ చేస్తుంది. దాన్ని తీయండి దానిని మార్చుకోండి లేదా నిష్క్రియం చేయండి, మీరు మళ్ళీ […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON