loader

వాంఖడేలో సూర్య వన్ మ్యాన్ షో.. యూఎస్ఏను చిత్తు చేసిన టీమిండియా..!

డిఫెండింగ్ ఛాంపియన్ భారత జట్టు పొట్టి ప్రపంచకప్‌లో బోణీ కొట్టింది. వాంఖడేలో యూఎస్‌ఏ బౌలర్ల విజృంభణతో టాపార్డర్, మిడిలార్డర్ కుప్పకూలినా.. కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(84 నాటౌట్) ఒంటరి సైనికుడిలా పోరాడి భారీ స్కోర్ అందించాడు.  అతడి శ్రమను బౌలర్లు సిరాజ్(3-29), అర్ష్‌దీపన్ సింగ్(2-18), అక్షర్ పటేల్ (2-24) వృథా చేయలేదు. 13 పరుగులకే 3 వికెట్లు కోల్పోయిన అమెరికా.. ఏ దశలోనూ ప్రత్యర్థి లక్ష్యం దిశగా సాగలేదు. 29 పరుగుల తేడాతో గెలుపొందిన భారత్ పాయింట్ల ఖాతా […]

పవర్‌ప్లేలోనే భారత్‌కు పవర్ కట్..86 పరుగులకే 6 కీలక వికెట్లు గల్లంతు

ముంబైలోని వాంఖడే స్టేడియంలో భారత్, అమెరికా మధ్య జరుగుతున్న టీ20 వరల్డ్ కప్ 2026 మ్యాచ్ అనూహ్య మలుపులు తిరుగుతోంది. టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అమెరికా నిర్ణయం సరైనదేనని వారి బౌలర్లు నిరూపించారు. ముఖ్యంగా ఇన్నింగ్స్ ఆరో ఓవర్‌లో అమెరికా బౌలర్ షాడ్లీ వాన్ షాక్విక్ సృష్టించిన విధ్వంసం భారత అభిమానులను షాక్‌కు గురిచేసింది. భారత ఇన్నింగ్స్ 14 ఓవర్లు ముగిసేసరికి స్కోరు 90/6.

స్కాట్‌ల్యాండ్ ఆలౌట్.. విండీస్ ఘన విజయం

ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా స్కాట్‌లాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో వెస్టిండీస్ ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 182 పరుగులు చేసింది. ఈ లక్ష్యంతో బరిలోకి దిగిన స్కాట్‌లాండ్ విండీస్ బౌలర్ల ధాటికి కుప్పకూలిపోయింది. ముఖ్యంగా రొమారియో షెపర్డ్ హ్యాట్రిక్‌తో పాటు ఐదు వికెట్ల ప్రదర్శన చేసి.. వెస్టిండీస్ విజయానికి బాటలు వేశాడు.  దీంతో స్కాట్‌లాండ్ 18.5 ఓవర్లలో 147 […]

నెదర్లాండ్స్‌పై పాకిస్థాన్ విజయం

టీ20 ప్రపంచ కప్ 2026లో పాకిస్థాన్ బోణి కొట్టింది. కొలంబో వేదికగా నెదర్లాండ్స్ తో జరిగిన తొలి మ్యాచ్ లో మూడు వికెట్ల తేడాతో పాకిస్థాన్ గెలిచింది. అయితే పసికూన అయిన నెదర్లాండ్స్ పాక్ కు గట్టి పోటీ ఇచ్చింది. గెలుపు కోసం నెదర్లాండ్స్ బౌలర్లు తీవ్రంగా శ్రమించిన ఫలితం దక్కలేదు. చివర్లో ఫహీమ్ అప్రష్ దూకుడుగా ఆడి.. పాక్ కు విజయాన్ని అందించాడు.

కోహ్లి, రోహిత్‌లకు బీసీసీఐ షాక్

భారత ప్లేయర్లు రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీకి సెంట్రల్ కాంట్రాక్టులో BCCI షాక్ ఇచ్చినట్లు తెలుస్తోంది. 2024-25 సంవత్సరానికి బీసీసీఐ ప్రకటించిన వార్షిక కాంట్రాక్టుల్లో వీరిద్దరినీ ఏ ప్లస్ గ్రేడ్ నుంచి బీ గ్రేడ్‌కు డిమోట్ చేసినట్లు తెలుస్తోంది. దీంతో వీరి వార్షిక వేతనం రూ.7 కోట్ల నుంచి రూ.3 కోట్లకు తగ్గనుంది. టి20, వన్డే, టెస్టులు ఆడేవారిని మాత్రమే ఏ ప్లస్ గ్రేడ్‌లో ఉంచే నిబంధన ప్రకారం, కేవలం వన్డేలు మాత్రమే ఆడుతున్న కోహ్లి, రోహిత్‌లకు […]

టీమిండియాకు వారణాసి స్పెషల్ గిఫ్ట్.!

T20 వరల్డ్ కప్‌ ప్రారంభమవుతున్న వేళ పురాతన నగరం వారణాసి నుంచి టీమ్ ఇండియాకు ఒక ప్రత్యేకమైన గిఫ్ట్ రెడీ అవుతోంది. వారణాసి  ప్రఖ్యాత బనారసీ హ్యాండ్లూమ్ కళాకారులు, టీమ్ ఇండియాలోని 15 మంది ప్లేయర్ల కుటుంబాల కోసం ప్రత్యేకంగా ‘క్రికెట్ బనారసీ చీరలు’ నేస్తున్నారు. ఈ చీరల పల్లూ మీద క్రికెట్ పిచ్, బ్యాట్, బాల్ డిజైన్లు అద్భుతంగా రూపొందించారు. డాక్టర్ సర్వేష్ కుమార్ శ్రీవాస్తవ మాట్లాడుతూ, ఈ చీరల థీమ్‌ను “Pride of Indian […]

పాక్ లక్ష్యం: 148

టి20వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ ముందు 148 పరగుల లక్ష్యాన్ని ఉంచింది. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్లలో స్కాట్ ఎడ్వర్డ్(37), బాస్ ది లీడీ(30) మైకెల్ లెవిట్(24), లగాన్ వ్యాన్ బీక్(0) పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మిజ్రా మూడు వికెట్లు తీయగా సయిబ్ అయుబ్, అబ్రార్ అహ్మద్, మహ్మద్ నవాజ్ తలో రెండు వికెట్లు తీయగా సహీన్ అఫ్రిదీ ఒక […]

రేపటి నుంచి టి20 వరల్డ్ కప్..

అభిమానులు ఎంతో ఆసక్తితో ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. టి20 వరల్డ్‌కప్ టోర్నమెంట్‌కు శనివారం తెరలేవనుంది. భారత్, శ్రీలంకలు సంయుక్తంగా ఆతిథ్యం ఇస్తున్న ఈ మెగా టోర్నీలో 20 జట్లు పోటీ పడుతున్నాయి. బరిలో ఉన్న జట్లను నాలుగు గ్రూపులుగా విభజించారు. శనివారం ఉదయం పాకిస్థాన్, నెదర్లాండ్స్ జట్ల మధ్య కొలంబోలో జరిగే మ్యాచ్‌తో వరల్డ్‌కప్ టోర్నీకి తెరలేస్తోంది.

అండర్ 19 ప్రపంచకప్ విజేతగా భారత్.. ఆరోసారి ట్రోఫీ ఎత్తిన యువసేన

భారత జట్టు ఆరోసారి అండర్-19 ప్రపంచ కప్‌ను గెలుచుకుంది. శుక్రవారం ఇంగ్లాండ్‌పై భారత జట్టు 100 పరుగుల భారీ విజయాన్ని సాధించింది. హరారే స్పోర్ట్స్ క్లబ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో 50 ఓవర్లలో 9 వికెట్లకు 411 పరుగులు చేసింది. 412 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఇంగ్లాండ్ 40.2 ఓవర్లలో 311 పరుగులకు ఆలౌట్ అయింది. కాలేబ్ ఫాల్క్‌నర్ 115 పరుగులు చేశాడు.

సూర్యవంశీ శివతాండవం…. భారత్ 224/2

ప్రపంచ కప్‌లో భాగంగా భారత్-ఇంగ్లాండ్ మధ్య జరుగుతున్న ఫైనల్ మ్యాచ్ టీమిండియా 23 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి 224 పరుగులతో ఆటను కొనసాగిస్తోంది. వైభవ్ సూర్యవంశీ సెంచరీతో చెలరేగాడు. 72 బంతుల్లో పది సిక్స్‌లు, తొమ్మిది ఫోర్లతో 155 పరుగులతో బ్యాటింగ్ చేస్తున్నాడు. పట్టపగలు ఇంగ్లాండ్ బౌలర్లకు చుక్కలు చూపించాడు. సూర్యవంశీ శివతాండవం చేశాడు. అయుష్ మాత్రే 53 పరుగులు చేసి క్యాచ్ ఇచ్చి మైదానం వీడాడు. రెండో వికెట్‌పై ఆయుష్ మాత్రే, వైభవ్ సూర్య […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON