loader

ముగిసిన ఒలింపిక్స్… 71వ స్థానంలో భారత్

నాలుగేండ్లకోసారి వచ్చే ప్రపంచ అతిపెద్ద క్రీడా పండుగ ముగిసింది. ఫ్రాన్స్‌ రాజధాని పారిస్‌ వేదికగా 17 రోజుల పాటు క్రీడాభిమానులను అలరించిన ఒలింపిక్స్‌కు ఆదివారంతో తెరపడింది. ఒలింపిక్‌ చరిత్రలో గతంలో ఎప్పుడూ లేనివిధంగా సీన్‌ నదిలో ప్రారంభ కార్యక్రమాలను నిర్వహించి ‘ఔరా’ అనిపించిన పారిస్‌.. ముగింపు వేడుకలనూ అదే స్థాయిలో మురిపించింది.తదుపరి 2028 ఒలింపిక్స్ లాస్ ఏంజెల్స్ లో జరుగనున్నట్లు ప్రకటించారు. అంతేకాక ఒలింపిక్ బ్యాటెన్ ను లాస్ ఏంజెల్స్ కు అందజేశారు.

రోహిత్ సేనపై కాసుల వర్షం.. టీమిండియాకు బీసీసీఐ భారీ నజరానా..

టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుని భారత క్రికెట్ జట్టు చరిత్ర సృష్టించింది. ఉత్కంఠభరితంగా సాగిన ఫైనల్లో దక్షిణాఫ్రికాను ఓడించి రోహిత్ సేన రికార్డు స్థాయిలో రెండోసారి టీ20 ప్రపంచకప్‌ను గెలుచుకుంది. ఈ ఛాంపియన్ ప్రదర్శనకు గానూ టీమ్ ఇండియా ఐసీసీ నుంచి మొత్తం రూ.22.76 కోట్లు ప్రైజ్ మనీగా అందుకుంది. రోహిత్ సేనకు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రూ.125 కోట్లు బహుమతిగా ప్రకటించింది బీసీసీఐ.

రోహిత్ వల్ల కానిది చేసి చూపించిన శ్రేయస్.. నో డౌట్ మనోడే భవిష్యత్తు కెప్టెన్!

కోల్‌కతా ఛాంపియన్ అవ్వడానికి శ్రేయాస్ అయ్యర్ కారణమంటూ నిజమైన క్రికెట్ లవర్స్ బల్లగుద్ది మరీ చెబుతున్నారు. ఫైనల్ మ్యాచులో అతను తీసుకున్న నిర్ణయాలే ఇందుకు కారణం. శ్రేయాస్ అయ్యర్ బౌలింగ్ మార్పు చేసిన ప్రతిసారీ కూడా సన్‌రైజర్స్ వికెట్ కోల్పోయింది.అంతేకాకుండా ఫీల్డింగ్ మార్పుల విషయంలో కూడా తన కెప్టెన్సీ మార్క్ చూపించాడు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON