loader

మెస్సీ పాదాల ఇన్సూరెన్స్ 9వేల కోట్లు..!

మీరు చదివింది నిజమే.. మెస్సీ పాదాల విలువ 1 బిలియన్ డాలర్..  అక్షరాలా 9వేల కోట్లు. అందులో ఎడమపాదానికే 7వేల కోట్ల ఇన్సూరెన్స్ ఉందని అంచనా. మెస్సీ కాళ్లు సాధారణ కాళ్లు కావు. అంతర్జాతీయ స్పోర్ట్స్ ఇన్సూరెన్స్ అంచనాల ప్రకారం, అతని కెరీర్‌లో వివిధ దశల్లో మెస్సీ కాళ్లకు సుమారు 700 మిలియన్ డాలర్ల నుంచి 1 బిలియన్ డాలర్ల వరకు  ఇన్సూరెన్స్ ఉందని అంచనా. ఈ సంఖ్యలు అధికారికంగా బయటకు రావు. కానీ విలువ ఎంత […]

బౌలర్ల కట్టడి.. బ్యాటర్ల మెరుపు.. భారత్ ఘన విజయం

భారత్, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌లో కీలకమైన మూడో మ్యాచ్‌లో టీమిండియా ఘన విజయం సాధించి సిరీస్‌లో 2-1 ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. సౌతాఫ్రికా ఇన్నింగ్స్ ఆరంభం నుంచే భారత బౌలర్ల ధాటికి తడబడింది. అర్ష్‌దీప్ సింగ్ తొలి ఓవర్‌లోనే రీజా హెండ్రిక్స్‌ను అవుట్ చేయగా, విజయం కోసం 118 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని అందుకునేందుకు బరిలోకి దిగిన టీమిండియా బ్యాటర్లు ధాటిగా ఆడి, ఎలాంటి ఇబ్బంది లేకుండా లక్ష్యాన్ని ఛేదించారు. ఓపెనర్లు శుభ్‌మన్ […]

ఒకే ఫ్రేమ్‌లో ఫుట్‌బాల్ దిగ్గజాలు.. వాంఖడేను హోరెత్తించిన ఫ్యాన్స్..!

‘గోట్ ఇండియా టూర్ 2025’లో భాగంగా ముంబై మహా నగరంలో లియోనల్ మెస్సీ అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా భారత ఫుట్‌బాల్ గోట్ సునీల్ ఛెత్రీ.. వరల్డ్ స్టార్ మెస్సీని కలిశాడు. ఇద్దరూ సాకర్ దిగ్గజాలు ఒకే ఫ్రేమ్‌లో కనిపించడంతో ఫ్యాన్స్ ఈలలు, కేకలతో వాంఖడేను హోరెత్తించారు. ఛెత్రికి సంతకం చేసిన తన పదో నంబర్ జెర్సీని కానుకగా ఇచ్చాడు మెస్సీ. అనంతరం సూరెజ్, డిపౌవ్‌లతో కలిసి ఇద్దరూ ఫొటో దిగారు.

బౌలింగ్ ఎంచుకున్న భారత్.. జట్టులో రెండు మార్పులు

ఐదు టి-20ల సిరీస్‌లో భాగంగా ధర్మశాలలోని హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం వేదికగా సౌతాఫ్రికాతో జరుగుతున్న మూడో టి-20లో భారత్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. ఈ సిరీస్‌లో ఇప్పటివరకూ భారత్, సౌతాఫ్రికా చెరో మ్యాచ్‌లో విజయం సాధించాయి. దీంతో ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్‌లో ఆధిక్యం సంపాదించుకోవాలని రెండు జట్లు భావిస్తున్నాయి. ఈ మ్యాచ్‌లో భారత్ జట్టులో రెండు మార్పులు చేసింది. అక్షర్, బుమ్రాలను జట్టు నుంచి తప్పించి వాళ్ల స్థానంలో హర్షిత్ రాణా, […]

తెలంగాణ అంటే ఎక్సలెన్స్, ఆతిథ్యం.. మెస్సీ అండ్ టీంకు సీఎం రేవంత్ థ్యాంక్స్

GOAT లియోనెల్ మెస్సీ, అలాగే ఫుట్‌బాల్ దిగ్గజాలైన లూయిస్ సువారెజ్, రోడ్రిగో డి పాల్ మా ఆహ్వానాన్ని మన్నించి హైదరాబాద్‌కు విచ్చేసి, క్రీడాభిమానులను, ముఖ్యంగా యువతను ఉర్రూతలూగించినందుకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. జీవితకాలం గుర్తుండిపోయే జ్ఞాపకంగా మార్చినందుకు, మా లీడర్ రాహుల్ గాంధీకి కృతజ్ఞతలు తెలిపారు. మా ప్రభుత్వం తరఫున, మా అతిథులకు ఆతిథ్యం ఇచ్చే విషయంలో అద్భుతంగా వ్యవహరించిన, క్రమశిక్షణను కనబరచిన క్రీడాభిమానులు, అభిమానులందరికీ ధన్యవాదాలు’ అని రేవంత్ రెడ్డి […]

మెస్సీ కోల్‌కతా పర్యటనలో గందరగోళం

కోల్‌కతాలోని సాల్ట్ లేక్ స్టేడియంకి వచ్చిన మెస్సీని చూసేందుకు పెద్ద ఎత్తున అభిమానులు తరలివచ్చారు. మెస్సీ మ్యాచ్ ఆడకుండానే అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీంతో అభిమానులు ఆగ్రహానికి గురయ్యారు. ఫ్యాన్స్ గొడవ చేయడంతో సొరంగం ద్వారా మెస్సీ టీమ్ బయటకు వెళ్లిపోయింది. దీంతో ఫ్యాన్స్ స్టేడియంలోని సీట్లను ధ్వంసం చేశారు. గ్రౌండ్‌లోకి కుర్చీలు, వాటర్ బాటిళ్లు విసిరేశారు. బారికేడ్లు దాటుకొని చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించారు. మైదానంలోకి వెళ్లి టెంట్లు, బోర్డులు ధ్వంసం చేశారు. పోలీసులు ప్రస్తుతం అభిమానులను అదుపు […]

మెస్సీ ఇండియా టూర్- కోల్​కతాలో 70 అడుగుల విగ్రహం ఆవిష్కరణ

అర్జెంటీనా ఫుట్‌బాల్‌ దిగ్గజం లియోనెల్‌ మెస్సి గోట్‌ టూర్‌ ఆఫ్‌ ఇండియా ప్రారంభమైంది. కోల్‌కతాలో శనివారం ఉదయం లేక్‌టౌన్‌లో తన 70 అడుగుల విగ్రహాన్ని బాలీవుడ్‌ నటుడు షారుక్‌ఖాన్‌తో కలిసి మెస్సి వర్చువల్‌గా ఆవిష్కరించాడు. భద్రతా కారణాల రీత్యా అక్కడికి వెళ్లలేదు. తెల్లవారుజామున కోల్‌కతాకు చేరుకున్న మెస్సి వెంట ఇంటర్‌ మియామీ జట్టు సహచరులు రోడ్రిగో డిపాల్, లూయిస్‌ సువారెజ్‌ కూడా ఉన్నారు. 14ఏళ్ల తర్వాత భారత్‌కు వచ్చిన మెస్సిని చూడటానికి అభిమానులు వందల సంఖ్యలో విమానాశ్రయానికి […]

కోల్‌కతా చేరుకున్న మెస్సీ.. ఎయిర్‌పోర్ట్‌లోకి పరుగులు తీసిన ఫ్యాన్స్

ప్రముఖ అర్జెంటీనా ఫుట్‌బాల్‌ ప్లేయర్ లియోనల్‌ మెస్సీ భారత్ వచ్చేశారు. మొదటగా కోల్‌కతాలోని నేతాజీ సుభాష్ చంద్రబోస్ అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆయన చేరుకున్నారు. ఉదయం తెల్లవారుజాము 3:30 గంటల సమయంలో ఆయన ప్రత్యేక విమానంలో వచ్చారు.మెస్సీ కోల్‌కతాలో ల్యాండ్ అయ్యారు అనే విషయం తెలుసుకున్న ఆయన అభిమానులు ఎయిర్‌పోర్ట్‌ లోపలికి ఒక్కసారిగా పరుగులు తీసిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. 14 ఏళ్ల తర్వాత భారత్‌కు ఆయన రావడం ఇదే మొదటిసారి.

గిల్ ఫెయిల్.. బిసిసిఐపై మాజీలు ఫైర్

టీమిండియా స్టార్ ఆటగాడు శుభ్‌మన్ గిల్ వరుసగా రెండు మ్యాచ్‌లలో డకౌట్ కావడాన్ని భారత మాజీ క్రికెటర్లు తప్పుపడుతున్నారు. గిల్‌కు చిన్న వయసులో కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించి బిసిసిఐ పెద్ద పొరపాటే చేసిందని ఆకాశ్ చోప్రా, మహ్మద్ కైఫ్, శ్రీకాంత్, అశ్విన్ వంటి మాజీ క్రికెటర్లు విమర్శించారు. గిల్ ఇలాగే ఆడితే టీమిండియాకు ఇబ్బందులు ఖాయమని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంతకాలంగా గిల్ తన స్థాయికి తగ్గ బ్యాటింగ్‌ను కనబరచడంలో విఫలమవుతున్నాడని, ఇది భారత క్రికెట్ […]

రిటైర్‌మెంట్​పై వినేశ్‌ ఫొగాట్‌ యూటర్న్​- 2028 ఒలింపిక్సే టార్గెట్​

ప్రముఖ ఇండియన్ రెజ్లర్​ వినేశ్ ఫొగాట్​ శుక్రవారం కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. తన రిటైర్​మెంట్​ను వెనక్కు తీసుకుంటున్నానని, 2028 ఒలింపిక్స్​లో మెడల్ సాధించడమే లక్ష్యంగా బరిలోకి దిగుతానని ప్రకటించారు. పారిస్ ఒలింపిక్స్​లో నిర్దేశిత వెయిట్ కంటే 100 గ్రాములు​ ఎక్కువ ఉండడంతో వినేశ్ ఫొగాట్ (31 ఏళ్లు)​ను అనర్హులిగా ప్రకటించి, ఫైనల్​లో ఆడనివ్వలేదు. వాస్తవానికి ఒలింపిక్స్ రైజ్లింగ్ ఫైనల్​కు చేరిన తొలి భారతీయ మహిళగా వినేశ్ ఘనత సాధించారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON