loader

తొందరేమీ లేదు.. అన్నింటికీ సమయం వస్తుంది: అంబటి

తొందరేమీ లేదు.. అన్నింటికి మూల్యం చెల్లించుకునే సమయం వస్తుందని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. పర్మిషన్‌ తీసుకునే నల్లపాడు వెంకటేశ్వరస్వామి గుడికి వెళ్లాను. టీడీపీ నేతలు కర్రలు, రాడ్డులు తీసుకుని నా కారు మీదకు వచ్చారు. 1వ తేదీ రాత్రి 10 గంటల 20 నిమిషాలకు నన్ను అరెస్ట్‌ చేశారు. టీడీపీ నేతలు కట్టిన ఫ్లైక్సీని చించలేదు. ఇది మంచి సాంప్రదాయం కాదని చెప్పా. 4 గంటల పాటు బీభత్సం సృష్టిస్తే పోలీసులు […]

పరువు నష్టం కేసు విచారణకు హాజరైన రాహుల్ గాంధీ

కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఉత్తరప్రదేశ్ లక్నోలోని సుల్తాన్‌పూర్ కోర్టులో పరువు నష్టం కేసు విచారణలో భాగంగా హాజరయ్యారు. 2018 కర్ణాటక అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సమయంలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై రాహుల్ చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఈ కేసు దాఖలైంది. బీజేపీ నేత విజయ్ మిశ్రా పరువు నష్టం దావా వేశారు. ఈ కేసు విచారణ ప్రస్తుతం కొనసాగుతుండగా, నేటి విచారణలో భాగంగా రాహుల్ గాంధీ కోర్టుకు హాజరై తన హాజరును […]

భార్యాపిల్లలను వివాదాల్లోకి లాగుతారా?’.. సీఎంపై ప్రియాంక ఆగ్రహం

అస్సాం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మపై కాంగ్రెస్ అగ్రనేత, వయనాడ్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ నేత గౌరవ్ గొగోయ్‌కు పాకిస్తాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ ముఖ్యమంత్రి చేస్తున్న ఆరోపణలను ఆమె ఖండించారు. రాజకీయాల్లో ప్రత్యర్థులపై విమర్శలు సహజమని, అయితే ఒక నాయకుడి భార్యను, పిల్లలను ఇటువంటి వివాదాల్లోకి లాగడం అత్యంత దుర్మార్గమైన రాజకీయమని ఆమె మండిపడ్డారు. గౌరవ్ గొగోయ్ ను వ్యక్తిగతంగా లక్ష్యంగా చేసుకుంటూ కుటుంబ సభ్యులను వేధించడం సరికాదని

మాజీ మంత్రి జీవన్ రెడ్డికి అస్వస్థత.. నిమ్స్‌కు తరలింపు

కాంగ్రెస్‌ సీనియర్‌ నాయకుడు, మాజీ మంత్రి జీవన్ రెడ్డి అస్వస్థతకు గురయ్యారు. వాంతులు, విరేచనాలతో బాధపడుతుండగా కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్‌కు తరలించారు. కాగా, జీవన్‌ రెడ్డి ఇటీవల కాలంగా కాంగ్రెస్ పార్టీలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నాడు. సీనియర్‌ అయిన తనను సరిగా గౌరవం ఇవ్వడం లేదని అసృంతృప్తికి లోనవుతున్నాడు. జీవన్‌ రెడ్డి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

జగన్‌ ఒక హ్యాబిట్యుయల్ క్రిమినల్ – ఏపీ హోంమంత్రి తీవ్ర ఆరోపణలు

ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై రాష్ట్ర హోం మంత్రి వంగలపూడి అనిత తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్‌ను ఒక హ్యాబిట్యుయల్ క్రిమినల్ గా అభివర్ణించారు. ప్రజలను నేరుగా ఎదుర్కోలేక, భయంతో దాక్కునే వ్యక్తి అని ఎద్దేవా చేశారు. జగన్ ప్రవర్తనను చూస్తుంటే ఆయనకు ఏదో రోగం ఉన్నట్లు అనిపిస్తోందని, ఆ రకమైన మనస్తత్వానికి ఏ పేరు పెట్టాలో గూగుల్‌లో వెతికినా దొరకడం లేదని అనిత వ్యంగ్యాస్త్రాలు సంధించారు. తాను చేసే తప్పులను ఇతరులపైకి నెట్టడం […]

రాష్ట్రం అప్పుల్లోకి వెళ్తుంటే… మీరేమో గాల్లో వెళ్తున్నారు..

బడ్జెట్‌లో చూపించిన లెక్కలు, రాష్ట్ర ఆర్థిక వాస్తవాల మధ్య పెద్ద తేడా ఉందని ఆరోపించారు. ఈ బడ్జెట్ ప్రజలను తప్పుదోవ పట్టించే విధంగా రూపొందించారని ఆయన పేర్కొన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ఆదాయాలు సరైన విధంగా ఉపయోగించడం లేదని, అవి ప్రజల అభివృద్ధికి దోహదం కావడం లేదని కూడా ఆరోపించారు. మరోవైపు ప్రభుత్వ నాయకుల ఖర్చులు పెరుగుతున్నాయని ఆయన వ్యాఖ్యానించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు,నారా లోకేష్,పవన్ కళ్యాణ్ విమానాలు,హెలికాప్టర్లల్లో తరచూ ప్రయాణాలు చేస్తూ ప్రభుత్వ ఖర్చులు పెంచుతున్నారని […]

వైసీపీ చైర్‌పర్సన్ సహా నలుగురు కౌన్సిలర్ల జంప్!

తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మున్సిపాలిటీలో అధికార వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వైసీపీ తరఫున 4వ వార్డు కౌన్సిలర్‌గా గెలిచి, ప్రస్తుతం మున్సిపల్ చైర్‌పర్సన్‌గా బాధ్యతలు నిర్వహిస్తున్న బావన రత్నకుమారి తన పదవికి, పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశం పార్టీలో చేరారు. గళగిరిలో టీడీపీ కీలక నేత పల్లా శ్రీనివాసరావు సమక్షంలో బావన రత్నకుమారి మరియు కౌన్సిలర్లు టీడీపీలో చేరారు. ఈ పరిణామంతో కొవ్వూరు మున్సిపాలిటీలో వైసీపీ బలం తగ్గి, టీడీపీ తన ఆధిక్యాన్ని […]

ప్రధాని మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరు

దేశ రాజధానిలోని భారత్ మండపంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్ – 2026’ లో భాగంగా ప్రధాని నరేంద్ర మోడీ ఏర్పాటు చేసిన ప్రత్యేక విందుకు సిఎం రేవంత్‌రెడ్డి హాజరయ్యారు. ఈ సదస్సుకు ఓపెన్ ఏఐ సీఈఓ శ్యామ్ ఆల్ట్మాన్, గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వంటి గ్లోబల్ టెక్ లీడర్లతో పాటు సుమారు 40 మందికి పైగా అంతర్జాతీయ కంపెనీల సీఈఓలు హాజరయ్యారు. వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఐటీ మంత్రులు, 45కు […]

క్యాతనపల్లిలో హై టెన్షన్.. బాల్క సుమన్ అరెస్ట్

మంచిర్యాల జిల్లా క్యాతనపల్లి మున్సిపాలిటీలో ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఛైర్మన్ ఎన్నిక విషయంలో ఉత్కంఠ కొనసాగుతోంది. బిఆర్ఎస్ నేత బాల్క సుమన్ ఇంటి చుట్టు పోలీసులు మోహరించారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేశారు. దీంతో భారీగా అక్కడికి చేరుకున్న కార్యకర్తలు అరెస్టును అడ్డుకొనే ప్రయత్నం చేశారు.తమపై కాంగ్రెస్ కౌన్సిలర్లు దౌర్జన్యం చేసి అసభ్యకరంగా ప్రవర్తించారని.. బిఆర్ఎస్, సిపిఐ మహిళ కౌన్సిలర్లు కన్నీటి పర్యంతమయ్యారు. దీంతో బుధవారం పట్టణ బంద్‌కు బిఆర్ఎస్, సిపిఐ పిలుపునిచ్చింది.

రికార్డు సృష్టించిన స్పీకర్ కుమార్తె

తెలంగాణ శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కుమార్తె గడ్డం అనన్య (24) అతి పిన్న వయసులోనే మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికై రికార్డు సృష్టించారు. వికారాబాద్‌కు చెందిన అనన్య, కాంగ్రెస్ పార్టీ తరపున 17వ వార్డు నుంచి విజయం సాధించి, ఏకగ్రీవంగా మున్సిపల్ చైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు. ఈ విజయంతో ఆమె పేరు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. తండ్రి నీడలో కాకుండా, క్షేత్రస్థాయి రాజకీయాల్లో తనదైన గుర్తింపు తెచ్చుకోవాలన్నదే తన లక్ష్యమని అనన్య తెలిపారు. వికారాబాద్ అభివృద్ధికి కృషి […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON