loader

అన్నపూర్ణ స్టూడియోను సందర్శించిన భట్టి విక్రమార్క

డిప్యూటీ ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌కి ప్రత్యేకంగా వెళ్లి పర్యటించారు. ప్రముఖ నటుడు అక్కినేని నాగార్జున ఆహ్వానం మేరకు జరిగిన ఈ సందర్శనలో, సినిమా రంగం అభివృద్ధి గురించి ఇద్దరూ చర్చించారు. స్టూడియోకు చేరుకున్న వెంటనే నాగార్జున భట్టికి స్వాగతం పలికారు. అనంతరం అక్కడ ఉన్న అక్కినేని నాగేశ్వరరావు విగ్రహానికి డిప్యూటీ సీఎం పూలమాల అర్పించారు. స్టూడియోలో అమర్చిన నూతన సాంకేతిక పరికరాలు, ఫిల్మ్ స్కూల్‌లో జరుగుతున్న శిక్షణా విధానాలు, విద్యార్థులకు అందిస్తున్న […]

ఎస్‌ఐఆర్‌ కోసం ఇంకెంత మంది చావాలి’.. బెంగాల్‌ సీఎం

పశ్చిమబెంగాల్‌ లో ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్‌ రివిజన్‌ పని ఒత్తిడిని తట్టుకోలేక మరో అధికారిణి ఆత్మహత్యకు పాల్పడటంపై ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జి స్పందించారు. ‘ఇంకెంత మంది ఎన్నికల అధికారులు చనిపోవాలి..’ అని కేంద్ర ఎన్నికల సంఘాన్ని, ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఒక పద్ధతి అనేది లేకుండా రాష్ట్రంలో స్పెషల్‌ ఇంటెన్సివ్‌ రివిజన్‌ చేపట్టడం అధికారులపై పనిభారం పెంచుతోందని మమతాబెనర్జి మండిపడ్డారు. కేంద్రం వెంటనే తన నిర్ణయాన్ని విరమించుకోవాలని డిమాండ్‌ చేశారు.

రూ. 5 లక్షల కోట్ల భూకుంభకోణానికి సిఎం రేవంత్ కుట్ర: కెటిఆర్

కాంగ్రెస్ ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన హైదరాబాద్ ఇండస్ట్రియల్ ల్యాండ్స్ ట్రాన్స్ ఫర్మేషన్ పాలసీ (హెచ్ఐఎల్టిపి) పేరిట సిఎం రేవంత్ రెడ్డి (TG) రూ.5 లక్షల కోట్ల విలువైన భూకుంభకోణానికి పాల్పడాలని చూస్తున్నారని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ సంచలన ఆరోపణలు చేశారు. బాలానగర్, జీడిమెట్ల, సనత్నగర్, అజామాబాద్ సహా హైదరాబాద్ లోని కీలకమైన పారిశ్రామిక క్లస్టర్లలో ఉన్న సుమారు 9,292 ఎకరాల విలువైన భూమిని క్రమబద్ధీకరించడానికి ఈ పాలసీ ప్రయత్నిస్తోందని ఆయన తెలిపారు.

ఏ తప్పూ చేయలేదు.. లై డిటెక్టివ్‌కు రెడీ: కేటీఆర్

ఫార్ములా ఈ కారు రేసు కేసులో తన ప్రాసిక్యూషన్‌కు గవర్నర్ అనుమతిపై కేటీఆర్ స్పందించారు. చట్టం తన పని తాను చేసుకుపోతుందని.. చేసుకుపోనివ్వండన్నారు. ఫార్ములా ఈ రేసింగ్‌లో తాను ఏ తప్పు చేయలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. లై డిటెక్టివ్ టెస్ట్‌కు కూడా తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. కాంగ్రెస్, బీజేపీల తెలంగాణలో జాయింట్ వెంచర్ ప్రభుత్వం నడుస్తోందన్నారు. తనను అరెస్ట్ చేసే ధైర్యం రేవంత్ రెడ్డికి లేదని.. అరెస్ట్ జరగదని ధీమా వ్యక్తం చేశారు. అందులో […]

ఈ నెల 26న కోనసీమ జిల్లాలో పర్యటించనున్న పవన్ కళ్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కీలక పర్యటనకు సిద్ధమయ్యారు. ఈ నెల 26న కోనసీమ జిల్లా కేశనపల్లిలో కొబ్బరిచెట్లను ఆయన పరిశీలించనున్నారు. దీంతో పాటు 15గ్రామాల రైతులను పరామర్శించనున్నట్లు జనసేన వర్గాలు తెలిపాయి మొంథా తుఫాను తర్వాత రైతులు ఎదుర్కొంటున్న ఆర్థిక ఇబ్బందులు, పంట పునరుద్ధరణ ఖర్చులు గురించి, ఆయన సమగ్రంగా అడిగి తెలుసుకోనున్నారు.. అనంతరం ఆయన పల్లెపండుగ 2.0 కార్యక్రమంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తారని పేర్కొన్నాయి.

తిరుమల శ్రీవారి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదు: వైవీ సుబ్బారెడ్డి

తిరుమల శ్రీవారి సేవలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని టీటీడీ మాజీ చైర్మన్, వైసీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి తెలిపారు. గత వైసీపీ ప్రభుత్వ హయాంలో తాను టీటీడీ చైర్మన్‌గా ఉన్న సమయంలో శ్రీవారి నిధులను ఆదా చేయడానికి కృషి చేశామని చెప్పారు. రాజకీయ కుట్రతోనే సీఎం చంద్రబాబు శ్రీవారి లడ్డూ ప్రసాదానికి అపవిత్రత ఆపాదించేలా దుష్ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తిరుమల కల్తీ నెయ్యి కేసుకు సంబంధించి సీబీఐ నేతృత్వంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం గురువారం రోజున […]

ఢిల్లీకి చేరిన కర్ణాటక కాంగ్రెస్‌ లొల్లి.. డీకేను సీఎం చేయాలని ఎమ్మెల్యేల ఒత్తిడి

కర్ణాటకలో కాంగ్రెస్‌ సర్కారు అధికారంలోకి వచ్చి రెండున్నరేండ్లు పూర్తయిన వేళ పార్టీలో సంక్షోభం మరింత ముదిరింది. ప్రస్తుతం డిప్యూటీ సీఎంగా ఉన్న డీకే శివకుమార్‌ వర్గానికి చెందిన ఓ మంత్రి సహా పది మంది ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లారు. నాయకత్వ మార్పు కోసం అధిష్ఠానంపై ఒత్తిడి పెంచుతున్నారు. సిద్ధరామయ్య ముఖ్యమంత్రిగా రెండున్నరేండ్లు పూర్తి చేసుకున్న నేపథ్యంలో మిగతా రెండున్నరేళ్లు తమ నాయకుడిని సీఎంని చేయాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు.

కోర్టుకు హాజరవుతూ ‘రప్పా రప్పా’ బ్యానర్లతో ర్యాలీ చేయడం సిగ్గుచేటు: కూటమి నేతలు

వైఎస్సార్సీపీ కార్యకర్తలు కోర్టు సమీపంలో రోడ్డుపై గుంపులుగా చేరి నినాదాలు చేశారు. ‘2029లో రప్పా రప్పా’ అంటూ రాసి ఉన్న బ్యానర్లు ప్రదర్శించారు.దీనిపై కూటమి నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కోర్టు ప్రాంగణంలో జగన్, ఆ పార్టీ కార్యకర్తలు వ్యవహరించిన తీరు అతి జుగుప్సాకరమని మండిపడ్డారు. న్యాయ వ్యవస్థను హేళన చేసేలా ఉందని మంత్రి కొల్లు రవీంద్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. హైదరాబాద్​లో జగన్ వ్యవహరించిన తీరు అతి జుగుప్సాకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల […]

ఎవరీ శ్రేయసి సింగ్?

బిహార్‌లో గురువారం ఎన్డీఏ ప్రభుత్వం మరోసారి కొలువుదీరింది. ప్రమాణ స్వీకారం కార్యక్రమంలో ఎమ్మెల్యే పదవికి ప్రమాణ స్వీకారం చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించింది శ్రేయసి సింగ్ ఆమె భారతీయ క్రీడా రంగంతో పాటు బిహార్ రాజకీయాల్లో ప్రఖ్యాతి పొందారు. ఆమె ఒక అగ్రశ్రేణి షూటర్. బీహార్ రాష్ట్రంలోని జముయీ నియోజకవర్గం నుంచి 1,23,868 ఓట్లతో విజయం సాధించారు. ఈమె దివంగత మాజీ కేంద్ర మంత్రి దిగ్విజయ్ సింగ్ కుమార్తె. శ్రేయసి తల్లి పుతుల్ కుమారీ ఎంపీగా పని […]

88 మ్యాజిక్ ఫిగర్ దాటిందా గంగమ్మ జాతరేనంటూ రచ్చ…వైసీపీ శ్రేణుల ప్లకార్డులు

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. నాంపల్లి సీబీఐ ప్రత్యేక కోర్టు దగ్గరకు వైసీపీ శ్రేణులు, కార్యకర్తలు భారీగా తరలివచ్చారు.కోర్టు వద్ద పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినప్పటికీ అభిమానులు తరలివచ్చారు. అంతేకాదు రప్ప రప్ప బ్యానర్లు, ప్లకార్డులను సైతం ప్రదర్శించారు . ‘2029లో రప్పారప్పా’ అంటూ బ్యానర్లు, ప్లకార్డులు ప్రదర్శించారు. అంతేకాదు 88 మ్యాజిక్ ఫిగర్ దాటిన తర్వాత గంగమ్మ జాతరే అంటూ రాసుకొచ్చారు. […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON