loader

మహిళను కర్రతో కొట్టి కాళ్లతో తన్నిన బీజేపీ నేత..

బీజేపీ నేత ఒక మహిళను దారుణంగా కొట్టాడు. కర్రతో చితకబాదాడు. కాళ్లతో ఆమెను తన్నాడు. ఆ మహిళ వీపుపై పిడిగుద్దులు కురిపించాడు. ఈ నేపథ్యంలో ఆ బీజేపీ నేత తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది. బీజేపీ పాలిత మధ్యప్రదేశ్‌లోని సిద్ధి జిల్లాలో ఈ సంఘటన జరిగింది. అయితే ఆ మహిళను ఎందుకు అలా కొట్టాడో అన్నది తెలియలేదు. మధ్యప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ  అధ్యక్షుడు జీతూ పట్వారీ ఈ వీడియో […]

పాక్ ఏజెంట్​కు- కాంగ్రెస్ ఎంపీ, ఆయన భార్యతో సన్నిహిత సంబంధాలు: అసోం సీఎం

కాంగ్రెస్‌ ఎంపీ గౌరవ్‌ గొగోయ్‌ సతీమణి ఎలిజబెత్‌ గొగోయ్‌కు పాకిస్థాన్‌తో సంబంధాలు ఉన్నాయంటూ అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వశర్మ తీవ్ర ఆరోపణలు చేశారు. ప్రపంచ వేదికలపై భారత్‌ను విమర్శించే పాక్‌ జాతీయుడు అలీ తౌఖీర్‌ షేక్‌తో ఆమెకు సంబంధాలు ఉన్నాయని తెలిపారు. ఆ ఏజెంట్‌ 2010-13 మధ్యకాలంలో 13 సార్లు భారత్‌కు వచ్చాడని, ప్రపంచవ్యాప్తంగా అతడు భారత వ్యతిరేక ప్రచారం చేశాడని పేర్కొన్నారు. ఆదివారం గువాహటిలో జరిగిన మీడియా సమావేశంలో ఈ మేరకు వ్యాఖ్యలు చేశారు.

మళ్లీ వచ్చేది బిఆర్ఎస్ ప్రభుత్వమే : కెటిఆర్

కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదని బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ ఆరోపించారు. ఆడబిడ్డలకు తులం బంగారం ఇస్తామని మోసం చేశారని అన్నారు. వికారాబాద్ జిల్లా తాండూరులో మున్సిపల్ ఎన్నికల ప్రచారం సందర్భంగా ఇందిరా చౌక్ దగ్గర కార్నర్ లో కెటిఆర్ మాట్లాడారు. రైతు భరోసాను సిఎం రేవంత్ రెడ్డి ఎగ్గొట్టారని, ఉద్యోగాల పేరుతో యువతను కాంగ్రెస్ మోసం చేసిందని విమర్శించారు. రేవంత్ పాలనలో యూరియా కష్టాలు తప్పడం లేదని, ఆరుగ్యారెంటీల పేర్లుతో ప్రజల్ని మోసం […]

బీజేపీ గెలిస్తే…మంచిర్యాలలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తాం: దేవేంద్ర ఫడ్నవీస్

తెలంగాణ మున్సిపల్‌ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కోరారు. మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ పీఠంపై బీజేపీ అభ్యర్థిని కూర్చొబెట్టాలని… అప్పుడు పట్టణంలో ఛత్రపతి శివాజీ మహారాజ్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని తెలిపారు. తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా మంచిర్యాల, కాగజ్‌నగర్‌లలో దేవేంద్ర ఫడ్నవీస్ పర్యటించారు. కాగజ్‌నగర్‌లో నిర్వహించిన విజయ్ సంకల్ప్ సభ, మంచిర్యాలలో రోడ్ షోలో పాల్గొని బీజేపీ అభ్యర్థుల తరఫున ప్రచారం నిర్వహించారు.

మేం డబ్బులు పంచుతుంటే వీడియో తీస్తారా? – పాత్రికేయులపై కాంగ్రెస్ కార్యకర్తల దాడి

సూర్యాపేట జిల్లా కోదాడ పట్టణంలోని 7వ వార్డు కాంగ్రెస్ అభ్యర్థి ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు నగదును పంపిణీ చేశారు. అయితే ఈ దృశ్యాలను పాత్రికేయులు వీడియోలు తీశారు. దీంతో ఈ వీడియో తీసిన పాత్రికేయులపై కాంగ్రెస్ అభ్యర్థి అనుచరులు మూకుమ్మడి దాడికి దిగారు. అతడి సెల్‌ఫోన్లు లాక్కొని వీడియోలు తొలగించారు. కాంగ్రెస్ అభ్యర్థి అనుచరుల దాడిని జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండించాయి.

జగన్‌ పర్యటనలకు పోలీసుల అనుమతి తీసుకోవడం లేదు : హోం మంత్రి అనిత

వైఎస్ జగన్‌ ఏపీలో పర్యటనలకు పోలీసుల అనుమతి తీసుకోవడం లేదని హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. జగన్ వివిధ జిల్లాల్లో పర్యటించేటప్పుడు పోలీసుల నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోవడం లేదని పేర్కొన్నారు. ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు అని ప్రశ్నించారు. కనీస విచక్షణ లేకుండా ఇష్టాను సారం వెళ్తానంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. కాగా, మాజీ మంత్రి జోగి రమేష్‌ పై పోలీసులు కేసు నమోదు చేశారు.

పాక్ లక్ష్యం: 148

టి20వరల్డ్ కప్‌లో భాగంగా పాకిస్థాన్-నెదర్లాండ్స్ మధ్య మ్యాచ్‌లో నెదర్లాండ్స్ జట్టు 19.5 ఓవర్లలో 147 పరుగులు చేసి ఆలౌటైంది. పాక్ ముందు 148 పరగుల లక్ష్యాన్ని ఉంచింది. నెదర్లాండ్స్ బ్యాట్స్‌మెన్లలో స్కాట్ ఎడ్వర్డ్(37), బాస్ ది లీడీ(30) మైకెల్ లెవిట్(24), లగాన్ వ్యాన్ బీక్(0) పరుగులు చేసి ఔటయ్యారు. పాక్ బౌలర్లలో సల్మాన్ మిజ్రా మూడు వికెట్లు తీయగా సయిబ్ అయుబ్, అబ్రార్ అహ్మద్, మహ్మద్ నవాజ్ తలో రెండు వికెట్లు తీయగా సహీన్ అఫ్రిదీ ఒక […]

‘హౌడీ మోదీపై నమస్తే ట్రంప్‌దే ఆధిపత్యం’- మధ్యంతర వాణిజ్య ఒప్పందం వేళ కాంగ్రెస్ విమర్శలు

భారత్- అమెరికా మధ్య మధ్యంతర వాణిజ్య ఒప్పందం కుదరడంపై కాంగ్రెస్ స్పందించింది. మోదీ కౌగిలింతలు, ఫోటో షూట్​లు దేశానికి పెద్దగా ప్రయోజనం చేకూర్చలేదని విమర్శించింది. స్నేహితుడు ఎన్నటికీ స్నేహితుడిగా కొనసాగబోడంటూ (దోస్త్ దోస్త్ నా రహా) వ్యంగ్యాస్త్రాలు సంధించింది. హౌడీ మోదీ కంటే నమస్తే ట్రంప్‌దే పైచేయి అయ్యిందని ఎద్దేవా చేసింది. భారత్‌- అమెరికా మధ్యంతర వాణిజ్య ఒప్పందం గురించి ఇరు దేశాలు చేసిన సంయుక్త ప్రకటనలో డీల్ వివరాలను సరిగ్గా ప్రస్తావించలేదని కాంగ్రెస్ నేత జైరాం […]

మహిళా ఎమ్మెల్యే ఇంటి వద్ద క్షుద్రపూజలు

శింగనమల టీడీపీ ఎమ్మెల్యే బండారు శ్రావణి నివాసం వద్ద జరిగిన అనుమానాస్పద ఘటన కలకలం రేపింది. ఓ కారులో వచ్చిన కొందరు వ్యక్తులు ఆమె ఇంటి ముందుగా నిమ్మకాయలు, తెల్ల నువ్వులు పడేసి వెళ్లిపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు గురయ్యారు.  ఇలాంటి సంఘటనలు వరుసగా జరుగుతుండటంతో ఎమ్మెల్యే కుటుంబం భయాందోళనల్లో ఉన్నట్లు తెలుస్తోంది. కొన్ని నెలలుగా తమ నివాసం వద్ద ఇదే తరహా ఘటనలు పునరావృతమవుతున్నాయని ఎమ్మెల్యే శ్రావణి అనుమానం వ్యక్తం చేశారు. ఓ అసమ్మతి నేత […]

తెలంగాణలో 336 వార్డుల్లో జనసేన పోటీ

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల బరిలో జనసేన పార్టీ తన ఉనికిని చాటుకునేందుకు సిద్ధమైన వేళ, ఆ పార్టీ కీలక నిర్ణయం తీసుకుంది.రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 336 వార్డుల్లో తమ అభ్యర్థులను బరిలోకి దింపుతున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఇప్పటికే అభ్యర్థులందరికీ పార్టీ తరపున బి-ఫారమ్స్ (B-Forms) అందజేయడం, రిటర్నింగ్ అధికారులు వాటిని పరిశీలించి నామినేషన్లను ఆమోదించడంతో పార్టీ శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON