loader

పాకిస్థాన్‌పై పోరాటం.. హైదరాబాద్‌లో ఒవైసీ పోస్టర్లు!

హైదరాబాద్ నగరంలోని అనేక ప్రాంతాలలో మెట్రో పిల్లర్లపై ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ పోస్టర్లు వెలిశాయి. నగరంలోని పలు ప్రాంతాల్లో ఆయన బ్యానర్లు ఏర్పాటు చేశారు ఎంఐఎం కార్యకర్తలు. శత్రువులకు సరైన విధంగా బుద్ధి చెప్పాలని, మరోసారి భారత్ వైపు కన్నెత్తి చూసే అవకాశం కూడా ఇవ్వకూడదని తనదైన శైలిలో ఓవైసీ భారతీయ ప్రజలకు పిలుపునిచ్చారు. ఈ మేరకు నగరంలోని పలు ప్రాంతాల్లో వెలసిన ఓవైసీ పోస్టర్లు పార్టీ అభిమానులను, అనుచరులను మరింత ఉత్తేజితులను చేసేలా కనిపిస్తున్నాయి.

ఐపిఎల్ ఫైనల్- టాస్ గెలిచిన పంజాబ్..బౌలింగ్

ఐపీఎల్ 18వ సీజన్ ఫైనల్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్ (PBKS) వర్సెస్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) మధ్య జరుగుతోంది అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోడీ స్టేడియంలో జరుగుతోన్న ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. దీంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ముందుగా బ్యాటింగ్ చేయనుంది.

రాష్ట్ర అవతరణ రోజు కండువా మార్చిన కవిత..?

రాష్ట్ర అవతరణ దినోత్సవం రోజు కవిత చేసిన పనికి చాలామంది షాక్ అయిపోతున్నారు. రాష్ట్ర అవతరణ దినోత్సవం ముందే జాగృతి పార్టీ ఆఫీస్ ని కొత్తగా ఓపెన్ చేసిన కవిత తాజాగా రాష్ట్ర అవతరణ వేడుకలలో పాల్గొంది. ఇందులో కవిత వేసుకున్న కండువా కూడా మార్చుకుంది. జాగృతి అని ఉన్న కండువాని మెడలో వేసుకుంది.అలాగే  కవిత జై తెలంగాణ.. జై జాగృతి.. జై కేసీఆర్..అని చెప్పింది కానీ జై బీఆర్ఎస్ అని ఒక్కసారి కూడా తన నోటి […]

రూపాయికి ఎకరం- వైఎస్ జగన్‌కు నారా లోకేష్ చాలెంజ్

నారా లోకేష్ రాజీనామా చాలెంజ్ విసిరారు. పోటీగా జగన్ రాజీనామా చేయాల్సింది లేదని క్షమాపణ చెబితే చాలన్నారు. జగన్మోహన్ రెడ్డి ఉర్సా కంపెనీలు రూపాయికి ఎకరం భూములు ఇచ్చారని ఆరోపిస్తున్నారు. అది నిజం కాదని మార్కెట్ రేటుకే ఇచ్చామని నారా లోకేష్ అంటున్నారు. ఓ సారి క్లారిటీ ఇచ్చినా జగన్ ఆపకపోవడంతో ఆరోపణలు నిరూపిస్తే నేను నా మంత్రి పదవికి రాజీనామా చేస్తాను. మీరు చేసిన ఆరోపణలు తప్పని తేలితే రాష్ట్ర యువతకు క్షమాపణ చెప్పండి చాలు.

మమతా సర్కార్ శాశ్వతంగా కూలిపోతుంది- అమిత్ షా

బెంగాల్ పర్యటనలో ఉన్న ఉన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి అమిత్ షా మాట్లాడుతూ, 2026 లో మమతా బెనర్జీ ప్రభుత్వం శాశ్వతంగా కూలిపోతుందని అన్నారు. “సుభేందు అసెంబ్లీ ఎన్నికల్లో నిలబడినప్పుడల్లా దీదీ భయపడుతుంది. ఎన్నికల్లో మమతా బెనర్జీ హింసకు పాల్పడుతున్నారని అమిత్ షా ఆరోపించారు. ప్రజాస్వామ్యంలో హింసకు స్థానం లేదని అన్నారు. హింస లేకుండా ఓటు వేయండి, మీరు వాస్తవాన్ని అర్థం చేసుకుంటారు” అని అమిత్ షా పిలుపునిచ్చారు.

రింకూ సింగ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన ప్రియా సరోజ్..

టీమిండియా క్రికెటర్ రింకూ సింగ్ త్వరలో పెళ్లిపీటలు ఎక్కబోతున్నాడు. ఐపీఎల్ రాణించి టీమిండియాకు ఎంపికైన రింకూ సింగ్ సమాజ్‌వాదీ పార్టీ ఎంపీగా లోక్‌సభకు ఎన్నికైన ప్రియా సరోజ్ ల నిశ్చితార్థం జూన్ 8న లక్నోలో ఘనంగా నిర్వహించేందుకు ఇరు కుటుంబాలు ప్లాన్ చేశాయి. ఎంగేజ్‌మెంట్ అనంతరం నాలుగు నెలలకు వారణాసిలో నవంబర్ 18న రింకూ సింగ్, ప్రియా సరోజ్ వివాహ బంధంలోకి అడుగుపెడతారు. వారణాసిలోని తాజ్ హోటల్‌లో వీరి వివాహం జరగనుంది.

బెంగాల్‌లో ఇన్‌ఫ్లుయెన్సర్ అరెస్ట్.. తీవ్రంగా స్పందించిన పవన్ కళ్యాణ్

సోషల్ మీడియాలో మతపరమైన వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన ఇన్‌ఫ్లుయెన్సర్, న్యాయ విద్యార్థిని శర్మిష్ఠ పనోలీ అరెస్ట్‌‌పై పశ్చిమ్ బెంగాల్‌లో తీవ్ర రాజకీయ దుమారం రేగుతోంది. తాజాగా, ఈ వ్యవహారంపై ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించారు. సెక్యులరిజం అనేది రెండు మార్గాలు కలిగిన వీధిలా ఉండాలని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ‌పై పరోక్షంగా విమర్శించారు. సనాతన ధర్మాన్ని కించపరుస్తూ వ్యాఖ్యలు చేసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు.

యూకే పర్యటన ముగించుకుని, డల్లాస్‌ చేరుకున్నకేటీఆర్

భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు (KTR) యూకే పర్యటన విజయవంతంగా ముగిసింది. ఇంగ్లాండ్ గడ్డపై తెలంగాణ విజయగాథను అద్భుతంగా వినిపించారు. అధికారం కంటే పుట్టిన గడ్డ మీదనే తనకు మమకారం ఉంటుందని ఈ పర్యటనలో చాటారు. మే 27న యూకేలో అడుగుపెట్టిన కేటీఆర్ కు తెలంగాణ ఎన్.ఆర్.ఐలు ఘన స్వాగతం పలికారు. వారంతా కేటీఆర్ మాస్కులు ధరించి తమ అభిమానాన్ని చాటుకున్నారు.

కల్వకుంట్ల ఆర్ట్స్ బ్యానర్ కాంగ్రెస్ దర్శకత్వంలో చార్ పత్తా

కాంగ్రెస్ దర్శకత్వంలో BRS కొత్త సినిమా మొదలైయ్యిందన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. కల్వకుంట్ల ఆర్ట్స్ పతాకంపై కాంగ్రెస్ పార్టీ దర్శకత్వంలో కల్వకుంట్ల కవిత ప్రధాన పాత్రధారిగా ‘చార్ పత్తా’ సినిమాను నడిపిస్తోందన్నారు. ఇదంతా కాంగ్రెస్ ఆడుతున్న డ్రామా అన్నారు సంజయ్. ఇందులో కేసీఆర్ ను జోకర్ గా మార్చారని, కవిత ఎపిసోడ్ తో ప్రజలకు ఏమైనా మేలు జరుగుతోందా? మీడియా కూడా ఆలోచించాలన్నారు.

టెన్త్ క్లాస్ వ్యాల్యుయేషన్‌లో ప్రభుత్వ వైఫల్యం: బొత్స

మూడు రోజులు కడపలో టిడిపి మహానాడు డ్రామా అని మాజీ మంత్రి, వైసిపి నేత బొత్స సత్యనారాయణ విమర్శించారు. ఏడాదిలో ఏం చేశారో చెప్పుకోలేక ప్రజలను టిడిపి నేతలు మభ్యపెడుతున్నారని దుయ్యబట్టారు. టెన్త్ క్లాస్ వ్యాల్యుయేషన్‌లో ప్రభుత్వ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 1650 మంది రీవ్యాల్యుయేషన్‌ చేయించుకున్నారని, ప్రభుత్వ చర్యలతో విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందని బొత్స చురకలంటించారు. గతంలో 500 మంది కంటే ఎక్కువ విద్యార్థులు రీవ్యాల్యుయేషన్‌ చేయించుకున్న దాఖలు లేవన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON