loader

లిక్కర్ స్కాం కేసులో చెవిరెడ్డి అరెస్ట్

మద్యం కుంభకోణం కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. భాస్కర్ రెడ్డిపై లుక్‌ఔట్ నోటీసులు సైతం జారీ చేసిన సంగతి తెలిసిందే. అయితే లిక్కర్ కుంభకోణంలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని ఇరికించే కుట్ర జరుగుతుంది అంటూ ప్రచారం జరుగుతుంది. అయితే మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిపై లుకౌట్‌ నోటీసులు ఉండటంతో బెంగళూరు ఎయిర్‌పోర్ట్‌ లో చెవిరెడ్డిని ఇమ్మిగ్రేషన్‌ అధికారులు అడ్డుకున్నారు. అనంతరం ఏపీ పోలీసులకు సమాచారం అందజేశారు. దీంతో సిట్‌ అధికారులు బెంగళూరుకు […]

అది ప్రాథమిక హక్కుల ఉల్లంఘనే.. ఎసిబి ఆర్డర్స్ పై కెటిఆర్

ఫార్ములా ఈ కారు రేసు కేసులో సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ అప్పగించాలని ఎసిబి ఇచ్చిన ఆర్డర్స్ మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ స్పందించారు. ఎసిబి ఆదేశాలపై తన న్యాయవాదుల బృందంతో కెటిఆర్.. బలవంతంగా వ్యక్తిగత సెల్‌ఫోన్లు తీసుకోకూడదని సుప్రీం ఆదేశాలు ఉన్నాయన్నారు. సెల్‌ఫోన్‌, ల్యాప్‌టాప్‌ ఇవ్వాల్సిన అవసరం లేదని కెటిఆర్ లాయర్ల బృందం తెలిపారు.

బనకచర్లపై అనవసర రాద్ధాంతం చేస్తున్నారు: నిమ్మల

నిమ్మల మీడియాతో మాట్లాడుతూ.. వరదల వల్ల నష్టపోతున్న ఎపికి.. నీళ్లు ఉపయోగించుకునే హక్కుఉంది అని చెప్పారు. గోదావరి నీళ్లు నిరుపయోగంగా సముద్రంలో కలుస్తున్నాయని, ఎగువ నీటి అవసరాలు తీరిన తర్వాతే బనకచర్లకు నీళ్లు వృథాగా పోతున్నాయని ఆ నీళ్లనే బనకచర్లకు వాడుకుంటాం అని తెలియజేశారు. రాజకీయ లబ్ధి కోసమే బనకచర్లపై వైసిపి విమర్శలు చేస్తుందని మండిపడ్డారు.

వైసీపీ కార్యకర్త విగ్రహావిష్కరణకి జగన్ సహా కేవలం వంద మందికే అనుమతి

పల్నాడు జిల్లా సత్తెనపల్లి రూరల్ మండలం రెంటపాల గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ (YCP) సీనియర్ కార్యకర్త నాగ మల్లేశ్వరరావు విగ్రహావిష్కరణ కార్యక్రమం రేపు ఘనంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి హాజరుకానుండటంతో జిల్లా రాజకీయ వేడి పెరిగింది. భద్రతా కారణాలతో పోలీసులు జగన్‌తో పాటు కేవలం వంద మందికే ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అనుమతి ఇచ్చారు.

సోనియా గాంధీ ఆరోగ్యంపై కీలక అప్‌డేట్..

కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకురాలు, మాజీ అధ్యక్షురాలు సోనియా గాంధీ ఉదర సంబంధిత సమస్యతో బాధపడుతూ.. ఆదివారం రోజు ఆస్పత్రిలో చేరిన విషయం అందరికీ తెలిసిందే. ముఖ్యంగా ఆమె ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆస్పత్రిలో చేరగా.. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని వైద్యులు చెబుతున్నారు. అయితే మరికొన్ని గంటలు ఆమె ఆరోగ్య పరిస్థితిని వైద్యు నిశితంగా పరిశీలిస్తారని కూడా ఆస్పత్రి ఛైర్మన్ అజయ్ స్వరూప్ వెల్లడించారు.

స్థానిక సంస్థల ఎన్నికల కోసమే డైవర్షన్- కేటీఆర్

స్థానిక సంస్థలకు వెళ్లేందుకే బీఆర్ఎస్ నేతలపై అక్రమ కేసులు పెడుతున్నారని కేటీఆర్ ఆరోపించారు. ఏసీబీ ఆఫీసులో విచారణ ముగిసిన తర్వాత తెలంగాణ భవన్ కు వచ్చారు. కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. నాలుగు గోడల మధ్య ఎందుకు నాలుగు కోట్ల మంది ముందు లైడిటెక్టర్ సవాల్ విసిరితే రేవంత్ పారిపోయాడని కేటీఆర్ విమర్శించారు. ఫార్ములా ఈ రేసు కేసులో ఒక్క రూపాయి కూడా పక్కకు పోలేదన్నారు. తొమ్మిది గంటల పాటు అడిగిందే అడిగారన్నారు.

టీడీపీని జూనియర్ ఎన్టీఆర్‌కు అప్పగిస్తారా- అసదుద్దీన్ ఒవైసీ

కుమారుడు, యువనేత నారా లోకేష్‌కు తెలుగుదేశం పార్టీని అప్పగించాలని ఏపీ సీఎం చంద్రబాబుకు అసదుద్దీన్ ఒవైసీ సూచించారు. లోకేష్ జీవితాన్ని ఎందుకు నాశనం చేస్తున్నారు, ఎలాగూ మీరు జూనియర్ ఎన్టీఆర్‌కు టీడీపీ పగ్గాలు అప్పగించే అవకాశం లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మా భూములు మా ఇష్టం, మాకు నచ్చింది చేసుకుంటాం. దానిపై మీకు హక్కు ఏముంది. మీ పిల్లలనే మీరు నమ్మనప్పుడు వక్ఫ్ బోర్డు లాంటివి ఏం నమ్ముతారని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఎసిబి విచారణకు హాజరైన కెటిఆర్

ఫార్ములా ఈ కారు రేసు కేసులో ఎసిబి విచారణకు మాజీ మంత్రి, బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కెటిఆర్ హాజరయ్యారు. అంతకుముందు కెసిఆర్ తో కెటిఆర్ సమావేశమయ్యారు.  తెలంగాణ భవన్ లో  ఆయన మీడియాతో మాట్లాడారు. “ఈ కేసును 6 నెలల నుంచి విచారణ చేస్తున్నారు. ఏమీ తేల్చలేదు. 3 సార్లు కాదు.. 30 సార్లు పిలిచినా వస్తాను.అక్రమ కేసులకు భయపడం. లై డిటెక్టర్‌కు కూడా నేను సిద్ధం. చట్టాలు, కోర్టులపై మాకు గౌరవం ఉంది” అని కెటిఆర్ […]

కావ్యా మారన్‌తో పెళ్లి అంటూ ప్రచారం- అనిరుధ్ రవిచందర్ రియాక్షన్

మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ ఐపీఎల్‌లో సన్ రైజర్స్ సీఈవోగా వ్యవహరిస్తోన్న కావ్యా మారన్‌తో పెళ్లి అంటూ ప్రచారం సాగుతోంది. అనిరుధ్, కావ్యా మారన్ రిలేషన్ షిప్‌లో ఉన్నారని.. త్వరలోనే పెళ్లి చేసుకోనున్నారని కోలీవుడ్ మీడియాలో వార్తలు హల్చల్ చేశాయి. వీటిపై తాజాగా అనిరుధ్ స్పందిస్తూ కావ్యతో పెళ్లి వార్తలను ఖండించారు. ‘పెళ్లా?.. రూమర్స్ ప్రచారం ఆపండి’ అంటూ సోషల్ మీడియా వేదికగా క్లారిటీ ఇచ్చారు.

శరణమా… న్యాయ సమరమా?… నారా లోకేశ్ సవాల్

వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్…రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్‌ల మధ్య ట్విటర్ వార్ నడుస్తోంది. మరోసారి వైఎస్ జగన్‌పై లోకేశ్ ధ్వజమెత్తారు. ‘సవాల్ చేస్తే సౌండ్ ఆఫ్!’అంటూ జగన్‌ను ఉద్దేశించి మంత్రి లోకేశ్ సెటైర్లు వేశారు. తల్లికి వందనం డబ్బులు నా జేబులోకి వెళ్ళాయి అంటూ చేసిన ఆరోపణలు 24 గంటల్లో నిరూపించాలని ఛాలెంజ్ చేసాను. సమయం ముగిసింది, రుజువు చెయ్యలేదు, క్షమాపణ కోరలేదు. లీగల్ యాక్షన్ ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండండి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON