loader

వైసీపీ మాజీ మంత్రి నియోజకవర్గం పక్క జిల్లాలో విలీనం

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సొంత నియోజకవర్గం పుంగనూరును అన్నమయ్య జిల్లాలో విలీనం చేసేందుకు నోటిఫికేషన్ జారీ చేసింది. రాయచోటి కలెక్టర్ కార్యాలయానికి అభ్యంతరాలు రానప్పటికీ, పులిచెర్ల మండలంపై కొన్ని అభ్యంతరాలు వచ్చాయి. వాటిని పరిష్కరించిన తర్వాత విలీన ప్రక్రియ పూర్తవుతుంది. ఈ విలీనంతో అన్నమయ్య జిల్లాలో మండలాల సంఖ్య 35కు చేరుతుంది. రాజకీయంగా కూడా మార్పులు చోటుచేసుకుంటాయని భావిస్తున్నారు

జులై 1న బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడి ఎన్నిక‌

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్య‌క్షుడి ఎంపిక‌కు ముహుర్తం కుదిరింది. ఇక కొత్త అధ్య‌క్షుడు కొలువుదీర‌నున్నాడు. ఈ క్ర‌మంలో జులై 1న తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎన్నిక జ‌ర‌గ‌నుంది. ఈ నెల 29న ఇందుకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల కానుంది. అధ్య‌క్ష ప‌ద‌వి కోసం 30న నామినేషన్లు స్వీకరించ‌నున్నారు. ప్ర‌స్తుతం బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడిగా కిష‌న్ రెడ్డి కొన‌సాగుతున్న సంగ‌తి తెలిసిందే.

చెవిరెడ్డి మోహిత్ రెడ్డికి హైకోర్టులో ఎదురుదెబ్బ!

లిక్కర్ స్కామ్ కేసులో వైసీపీ నేత చెవిరెడ్డి మోహిత్ రెడ్డి తనపై సీఐడీ నమోదు చేసిన కేసును కొట్టివేయాలని దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలతో హైకోర్టు ఏకీభవించింది. దిగువ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ పెండింగ్‌లో ఉండగా, హైకోర్టులో క్వాష్ పిటిషన్‌లో మధ్యంతర ఉత్తర్వులు కోరడంపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ముందస్తు బెయిల్‌కు సంబంధించిన వాదనలను విజయవాడ కోర్టులోనే వినిపించాలని, అక్కడే తగిన ఆదేశాలు పొందాలని మోహిత్ రెడ్డికి సూచించింది.

రేవంత్ పై చర్యలు తీసుకున్న తరువాతే రాహుల్ బీహార్ కి రావాలి: ప్రశాంత్ కిషోర్

బీహార్ ప్రజలను కించపరిచేలా మాట్లాడిన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై రాహుల్ గాంధీ చర్యలు తీసుకోవాలని జన్ సురాజ్ పార్టీ అధ్యక్షుడు ప్రశాంత్ కిశోర్ డిమాండ్ చేశారు. ఆ తరువాతే బీహార్ రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి రాహుల్ రావాలని మండిపడ్డారు. కెసిఆర్ బీహార్ అడ్వైసర్‌లను పెట్టుకొని రాష్ట్రాన్ని దివాళా తీయించాడని, కూలీ పనులు చేయడం బీహార్ ప్రజల డిఎన్ఎలోనే ఉందని రేవంత్ రెడ్డి మాట్లాడారని గుర్తు చేశారు. ఇవాళ రాహుల్ గాంధీ ఏం మొహం పెట్టుకొని బీహార్‌లోకి […]

345 పార్టీలు.. జాబితా నుంచి తొలగించేందుకు ఈసీ కసరత్తు

దేశవ్యాప్తంగా 345 రాజకీయ పార్టీలు ఆరేళ్లుగా ఏ ఎన్నికల్లో కూడా పోటీ చేయలేదు. దీంతో ఆ రాజకీయ పార్టీలను జాబితా నుంచి తొలగించేందుకు ఎన్నికల కమిషన్‌ (ఈసీ) సిద్ధమైంది. 2019 నుంచి ఆరేళ్లుగా ఒక్క ఎన్నికల్లో అయినా పోటీ చేయాలన్న ముఖ్యమైన షరతును నెరవేర్చడంలో 345 రాజకీయ పార్టీలు విఫలమైనట్లు ఈసీ తెలిపింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన 2,800కు పైగా నమోదైన గుర్తింపు లేని రాజకీయ పార్టీలు ఉన్నాయని ఈసీ తెలిపింది.

అవినీతి కేసులో ఆప్ మాజీ మంత్రులపై కేసు నమోదు

మాజీ మంత్రులు సౌరభ్ భరద్వాజ్, సత్యేంద్ర జైన్‌లపై అవినీతి కేసు నమోదు అయ్యింది. ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) ప్రభుత్వ హయాంలో ఆమోదించిన ఆరోగ్య మౌలిక సదుపాయాల ప్రాజెక్టులలో పెద్ద ఎత్తున అవినీతి జరిగిందని ఆరోపిస్తూ అవినీతి నిరోధక శాఖ (ACB) మాజీ మంత్రులపై కేసు నమోదు చేసింది. ఢిల్లీ అంతటా ఆసుపత్రి భవనాలు, పాలీక్లినిక్‌లు, ICU మౌలిక సదుపాయాల అమలులో స్పష్టమైన అవకతవకలు, దుర్వినియోగం జరిగినట్లు అధికారులు గుర్తించారు

పాలమూరు రంగారెడ్డి, కాళేశ్వరం ప్రాజెక్టులను చంద్రబాబు వ్యతిరేకించి కేసులు వేశారు: కవిత

గోదావరి నది నీళ్లు ఆంధ్ర గవర్నమెంటు తీసుకెళ్లడానికి కేసీఆర్ గతంలో ఓకే చెప్పారని ఏపీ మంత్రులు చెబుతున్న దాంట్లో పూర్తి వాస్తవం లేదు. రెండు విషయాలు తెలంగాణ ప్రజలకు కచ్చితంగా తెలియాల్సిన అవసరం ఉంది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు, కాళేశ్వరం ప్రాజెక్టులు అడ్డుకునేందుకు ఏపీ సీఎం చంద్రబాబు కేంద్రానికి లేఖలు రాశారు. సుప్రీంకోర్టుకు కూడా వెళ్లారని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఆరోపించారు.

అక్ర‌మ కేసులు పెట్టిన వారే.. నాకు సెల్యూట్ కొట్టారు…

మచిలీపట్నం నియోజకవర్గ తెలుగుదేశంపార్టీ సమన్వయ సమావేశం సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రజలు మనపై బాధ్యత పెట్టారని, కష్టపడి ప్రజాసమస్యలు పరిష్కరించాలని విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. మచిలీపట్నం అంటే తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ అంటేనే మచిలీపట్నం. ఇక్కడ ఎప్పుడైతే గెలిచామో అప్పుడే రాష్ట్రవ్యాప్తంగా విజయం సాధించాం. నేను ఈ రోజు మచిలీపట్నం వస్తుంటే అడుగడుగునా పోలీసులు ఉన్నారు. మనపై అక్రమ కేసులు పెట్టిన వారే మనకు సెల్యూట్ కొట్టారంటే అదీ ప్రజాస్వామ్య […]

కులమత రాజకీయాల కోసం పవన్ ని తమిళనాడు రావొద్దన్న సత్యరాజ్…

సత్యరాజ్ పవన్ కళ్యణ్ ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేసారు. మురుగన్ పేరుతో తమిళనాడు లో రాజకీయాలు నడవవని, ఒక తమ్ముడు మురుగన్ పేరుతో రాజకీయాలు చేయటానికి ఇక్కడికి వచ్చాడు అని కీలక వ్యాఖ్యలు చేసాడు. ఇక్కడ కావలిసింది కులాన్ని నిర్మూలించడం. మతం వల్ల కులం బ్రతికే ఉంటుంది. అలంటి కులాల్ని పెంచి పోషించడానికి ఇక్కడికి రాకండి అంటూ సెటైరికల్ గా పంచులు వేసాడు. పెరియార్ సిద్ధాంతాలను నమ్ముకున్న మా దగ్గర మీ రాజకీయాలు చెల్లవని తీవ్ర వ్యాఖ్యలు […]

సెప్టెంబర్ 30లోపు స్థానిక సంస్థల ఎన్నికలు- తెలంగాణ హైకోర్టు

స్థానిక సంస్థల ఎన్నికలపై తెలంగాణ హైకోర్టు కీలక తీర్పు ఇచ్చింది. సెప్టెంబర్‌ 30వ తేదీ లోపు ఎన్నికల ప్రక్రియ పూర్తి చేయాలని ఎన్నికల సంఘానికి, ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. హైకోర్టు తీర్పుతో స్థానిక సంస్థల ఎన్నికలకు ప్రభుత్వం సిద్దమవుతోంది. బీసీలకు ఇచ్చిన హమీ మేరకు 42శాతం రిజర్వేషన్ల అమలుపై కసరత్తు చేస్తోంది. రిజర్వేషన్లు 50 శాతం దాటొద్దన్న సుప్రీంకోర్టు నిబంధనతో మల్లగుల్లాలు మొదలయ్యాయి.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON