loader

విజయ్‌ బేసిక్‌ పాలిటిక్స్‌ తెలుసుకోవాలి : డీఎంకే

అజిత్‌ కుమార్‌ కస్టోడియల్ డెత్‌ను నిరసిస్తూ నిరసన కార్యక్రమంలో విజయ్‌ వ్యాఖ్యలపై సోమవారం డీఎంకే స్పందించింది. నటుడు విజయ్‌ ముందుగా బేసిక్‌ రాజకీయాలు తెలుసుకోవాలని ఎద్దేవా చేశారు. కస్టోడియల్‌ డెత్‌లో పోలీసులు నిందితులుగా ఉన్నారని, ఐదుగురు పోలీసులు అరెస్టయ్యారని తెలిపారు. ఈ కేసును రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేయిస్తే పోలీసులు వాళ్ల కేసును వాళ్లే దర్యాప్తు చేసుకున్నారని విమర్శిస్తారని, సీబీఐకి అప్పగిస్తే సీబీఐ దర్యాప్తు ఎందుకు అంటారని విమర్శించారు. కాబట్టి ఆయన బేసిక్‌ పాలిటిక్స్‌ తెలుసుకోవాలని అన్నారు.

అప్పులపాలయ్యా.. నా కారు ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు.. జనసేన ఎమ్మెల్యే

గతంలో అష్టఐశ్వర్యాలతో తూగినటువంటి నా కుటుంబం.. ఈ రోజు చాలా పేదరికంలో ఉంది.. అప్పులపాలయ్యాం.. నా కారు కూడా ఫైనాన్స్ వాళ్లు తీసుకెళ్లారు. ప్రస్తుతం నా అల్లుడి కారు వాడుతున్నా..అంటూ తూర్పు గోదావరి జిల్లా రాజానగరం జనసేన ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలాంటిది కార్యకర్తల పరిస్థితి ఎలా ఉంటుందో తనకు తెలుసని.. మనందరికీ మంచి రోజులు వస్తాయని బత్తుల బలరామకృష్ణ చెప్పుకొచ్చారు. అయినా నమ్ముకున్న కార్యకర్తలకు న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు.

బాబు సర్కార్ పై ఫైర్ అవుతున్న కొలికపూడి..!

ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం రాజధాని నిర్మాణానికి 40,000 కు పైగా ఎకరాల భూమి సేకరించడంతో చాలామంది కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు. మాజీమంత్రి వడ్డే శోభనాద్రీశ్వరరావు కూడా ఈ విషయం పైన మాట్లాడారు. ఇప్పుడు తాజాగా తిరువూరు ఎమ్మెల్యే టిడిపి నాయకుడు అయిన కొలికపూడి కూడా ఈ విషయం పైన తిరుగుబాటు చేసినట్లు కనిపిస్తోంది. 10 సంవత్సరాల క్రితం రాజధాని భూములు పేరుతో భూములు తీసుకొని న్యాయం చేయకుండా ఇప్పుడు మళ్లీ 40 వేల ఎకరాలు కావాలంటూ తీసుకోవడంతో చాలామంది […]

ఈనెల 26న సింగపూర్‌కు చంద్రబాబు బృందం

అమరావతి రాజధాని నిర్మాణం.. ఆంధ్రప్రదేశ్‌కు పెట్టుబడులు తీసుకురావడమే లక్ష్యంగా సింగపూర్‌కు వెళ్లనున్నారు సీఎం చంద్రబాబు నాయుడు. ఈనెల 26 నుంచి 30 వరకు సింగపూర్‌లో పర్యటించనుంది చంద్రబాబు బృందం. సింగపూర్‌లోని రాజకీయ, వ్యాపార వర్గాలతో సమావేశం కానుంది. నగరాల ప్రణాళిక, నగర సుందరీకరణ, ఉద్యానవనాలు, ఓడరేవులు, మౌలిక వసతుల కల్పనపై చర్చలు జరపనుంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటు మంత్రులు నారాయణ, నారా లోకేశ్‌, టీజీ భరత్, అధికారులు సింగపూర్‌ వెళ్లనున్నారు.

తీన్మార్‌ మల్లనపై డీజీపీకి ఎమ్మెల్సీ కవిత ఫిర్యాదు

బీఆర్‌ఎస్‌ నేత, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత డీజీపీ ఆఫీస్‌కు వెళ్లి తీన్మార్‌ మల్లన్న అలియాస్‌ చింతపండు నవీన్‌పై ఫిర్యాదు చేశారు. తనపై అనుచిత వ్యాఖ్యలు చేసి, జాగృతి కార్యకర్తలపై దాడి చేయించి, కాల్పులు చేయించిన ఘటనపై ఆమె ఈ ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారు. మా జాగృతి కార్యకర్తలపై దాడి చేయించింది తీన్మార్ మల్లన్ననా? లేక ప్రభుత్వమా? అనేది తెలియాలి. దీని మీద సమగ్ర విచారణ చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేస్తున్నాను

మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా?: కవిత

ఆడబిడ్డలను గౌరవించడం నేర్చుకోండి అని బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న తనపై దారుణంగా మాట్లాడారని అన్నారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ..మహిళలు రాజకీయాల్లో మాట్లాడకూడదా? అని కవిత ప్రశ్నించారు. ఇష్టానుసారంగా మాట్లాడితే ఊరుకోం అని హెచ్చరించారు. తనపై అసభ్యకర మాటలు మాట్లాడితే ప్రభుత్వం స్పందించలేదని మండిపడ్డారు. వెంటనే తీన్మార్ మల్లన్నను అరెస్ట్ చేయాలని కవిత డిమాండ్ చేశారు.

మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కేస్తాం: తీన్మార్ మల్లన్న

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై జాగృతి కార్యకర్తలు దాడి చేసిన విషయం తెలిసిందే. ఈ దాడిపై మల్లన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. తనపై కవిత, ఆమె కుటుంబం హత్యయత్నానికి పాల్పడ్డారని ఆరోపించారు. మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ఈ తరహా దాడులతో బిసిలను, అణగారిన వర్గాలను అధికారంలోకి తీసుకొచ్చేందుకు మేం చేసే ప్రయత్నం కొంచెం కూడా తగ్గదు. ఇలాంటి వాటికి నేను భయపడను. మరింత ఉత్సాహంతో ముందుకు వెళ్తాం. రాసి పెట్టుకోండి.. రానున్న మూడేళ్లలో మిమ్మల్ని రాజకీయంగా పాతాళానికి తొక్కే […]

తీన్మార్ మల్లన్న కార్యాలయంపై దాడి..గన్‌మెన్ కాల్పులు

ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న కార్యాలయంపై తెలంగాణ జాగృతి కార్యకర్తలు దాడి చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై మల్లన్న చేసిన అనుచిత వ్యాఖ్యలే ఈ దాడికి కారణంగా తెలుస్తోంది. దాడి సమయంలో మల్లన్న కార్యాలయంలోనే ఉండగా.. ఆయన గన్‌మెన్లు రక్షణగా నిలిచారు. పరిస్థితి అదుపు తప్పడంతో ఐదు రౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపారు. కార్యాలయ ఫర్నిచర్ ధ్వంసం కావడంతో పలువురికి గాయాలయ్యాయి.

గుడివాడలో రప్పా రప్పా రాజకీయాలు

గుడివాడలో టీడీపీ, వైసీపీ మధ్య రోజంతా ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బాబు షూరిటీ మోసం గ్యారెంటీ పేరుతో వైసీపీ విస్తృత స్థాయి సభ ఏర్పాటు చేసింది. ఏడాది పాలన అయిన సందర్భంగా టీడీపీ కూడా తొలి అడుగు కార్యక్రమం ఏర్పాటు చేసుకుంది. మాజీమంత్రి కొడాలి నాని, సీఎం చంద్రబాబు బూట్ పాలిష్ చేస్తున్నట్లు నెహ్రూ చౌక్ సెంటర్లో ఫ్లెక్సీ ఏర్పాటు చేశారు. వైసీపీ నేతలు కూడా మోసం గ్యారంటీ ఫ్లెక్సీలు వేశారు. అయితే వాటిని టీడీపీ కార్యకర్తలు […]

15, 16వ తేదీల్లో సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్

ముఖ్యమంత్రి చంద్రబాబు రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. ఈ నెల 15,16వ తేదీల్లో దేశ రాజధాని ఢిల్లీలో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ సహా వేర్వేరు కార్యక్రమాలకు ముఖ్యమంత్రి హాజరుకానున్నారు. రాష్ట్రంలో చేపడుతోన్న వివిధ ప్రాజెక్టులు, కేంద్ర గ్రాంట్లపై సీఎం వారితో చర్చించనున్నారు. కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఆర్ధిక మంత్రి నిర్మలా సీతారామన్, మంత్రులు అశ్వినీ వైష్ణవ్, సీఆర్ పాటిల్, మన్సుఖ్ మాండవీయ,  తదితరులతో సీఎం తన ఢిల్లీ పర్యటనలో భేటీ కానున్నారు

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON