loader

పులివెందుల జడ్పీటీసీ ఉపఎన్నికలో టీడీపీ గెలుపు

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్న పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలో టీడీపీ గెలిచింది. దాదాపు 30 ఏళ్ల తర్వాత.. పులివెందులలో తొలిసారి టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతా రెడ్డి దాదాపు 6వేలకుపైగా ఓట్ల మెజార్టీతో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి హేమంత్ రెడ్డిపై విజయం సాధించారు. అసెంబ్లీ ఎన్నికల మాదిరిగా హోరాహోరీగా ఈ పులివెందుల ఉప ఎన్నికలు జరగడంతో ఫలితాలపై ఉత్కంఠ కనిపించింది.. మొత్తానికి అధికార పార్టీకి గెలుపు దక్కింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 11 మంది అభ్యర్థిలో […]

జూబ్లీహిల్స్‌ సీటు కోసం కాంగ్రెస్‌లో తీవ్ర పోటీ.. సోనియా, రాహుల్‌ని కలిసిన నేత

జూబ్లీహిల్స్‌ అసెంబ్లీ ఉప ఎన్నికను కాంగ్రెస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఈ ఉప ఎన్నికలో గెలిచేందుకు వ్యూహాలకు పదును పెడుతోంది హస్తం పార్టీ.  ముగ్గురు మంత్రులను ఇంచార్జిలుగా నియమించింది అధిష్టానం. జూబ్లీహిల్స్ టికెట్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశారు నేతలు. గతంలో ఇదే స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయిన అజారుద్దీన్ మళ్లీ తనకే టికెట్ ఇవ్వాలని ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. మంగళవారం ఢిల్లీ వెళ్లిన అజారుద్దీన్ సోనియాగాంధీ, రాహుల్ గాంధీని కలిశారు. మైనారిటీ కోటాలో టికెట్ […]

మరికొన్ని గంటల్లో పులివెందుల, ఒంటిమిట్ట ZPTC ఉపఎన్నికల కౌంటింగ్.

ఉద్రిక్తతలు, ఉత్కంఠగా సాగిన పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ ఉప ఎన్నిక ఓట్ల కౌంటింగ్‌కు సర్వం సిద్ధమైంది. పులివెందులలో మొత్తం ఓట్లు 10 వేల 601 కాగా.. 8 వేల 103 ఓట్లు పోలయ్యాయి. ఒంటిమిట్టలో మొత్తం 24 వేల 606 ఓట్లు ఉండగా.. 20 వేల 681 ఓట్లు పోలయ్యాయి. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు ఒక రౌండులో లెక్కింపు ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానానికి 10 టేబుళ్లు ఏర్పాటు చేయగా 2 రౌండ్లలో లెక్కింపు […]

ఎమ్మెల్సీలుగా కోదండరామ్‌, అమీర్‌ అలీఖాన్‌ నియామకంపై స్టే

2023లో గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా తమ నామినేషన్లను అప్పటి గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ తిరస్కరించడాన్ని సవాలు చేస్తూ దాసోజు శ్రవణ్‌, కుర్ర సత్యనారాయణలు తొలుత హైకోర్టును ఆశ్రయించారు. తెలంగాణలో గవర్నర్‌ కోటా ఎమ్మెల్సీల నియామకాల కేసులో సుప్రీంకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలపై స్టే విధించింది. అయితే కోర్టు మధ్యంతర ఉత్తర్వులు అమలులో ఉన్నప్పుడు కోదండరామ్, అమీర్ అలీ ఖాన్ ఎమ్మెల్సీలుగా ప్రమాణ స్వీకారం చేయడాన్ని సుప్రీం ధర్మాసనం తాజాగా […]

పులివెందులలో అరాచకాలు జరగలేదని అసహనంగా ఉన్నాడు.. జగన్‌పై ఏపీ సీఎం చంద్రబాబు సెటైర్లు

పులివెందుల జడ్పీటీసీ స్థానానికి నిర్వహించిన ఉప ఎన్నికను రద్దుచేసి, రీపోలింగ్‌ జరిపించాలన్న వైసీపీ అధినేత వైఎస్‌ జగన్ డిమాండ్‌పై ఏపీ సీఎం చంద్రబాబు ఘాటుగా స్పందించారు. వైఎస్‌ హయాం నుంచి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరగలేదని.. ఈసారి అరాచకాలు జరగలేదనే జగన్‌ అసహనంలో ఉన్నారని విమర్శించారు. రెండు పోలింగ్‌ బూత్‌ల్లో ఎప్పుడైనా రీపోలింగ్‌ జరిగిందా అని ప్రశ్నించారు. శాంతి భద్రతలు పటిష్టంగా ఉన్నాయి కాబట్టే ప్రజలు ధైర్యంగా ఓటేశారని తెలిపారు.

రాహుల్ గాంధీతో చంద్రబాబు టచ్‌లో ఉన్నారు…: వైఎస్ జగన్ సంచలన ఆరోపణలు

ఓట్‌ చోరీ పేరుతో రాహుల్ గాంధీ చేపట్టిన ర్యాలీకి వైసీపీ ఎందుకు దూరంగా ఉందని మీడియా ప్రతినిధులు ప్రశ్నించగా… దేశంలో ఓట్ల చోరీ అంటూ మాట్లాడుతున్న రాహుల్ గాంధీ… ఆంధ్రప్రదేశ్ గురించి ఎందుకు మాట్లాడటం లేదని వైఎస్ జగన్ ప్రశ్నించారు. చంద్రబాబు నాయుడు, రాహుల్ గాంధీలు హాట్ లైన్‌లో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జ్‌గా ఉన్న మాణిక్కం ఠాకూర్ ఏ రోజైన చంద్రబాబు గురించి మాట్లాడారా? అని ప్రశ్నించారు. ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ […]

ఆంధ్రప్రదేశ్‌లో 31 కార్పొరేషన్లకు చైర్మన్ల నియామకం

ఆంధ్రప్రదేశ్‌ లో కూటమి ప్రభుత్వం అడుగులు వేగవంతం చేస్తోంది. అధికారంలోకి వచ్చిన వెంటనే కీలక నామినేటెడ్ పదవుల భర్తీ ప్రారంభించింది. ఈ క్రమంలో 31 మంది నేతలకు పదవులు కేటాయిస్తూ జాబితాను విడుదల చేసింది. జనసేనకు మూడు, బీజేపీకి రెండు పదవులు ఇచ్చారు. మొత్తం 31 పదవుల్లో 17 స్థానాలను బీసీలకు కేటాయించారు. ఓసీలకు 6, ఎస్సీలకు 4, ఎస్టీలకు 1, మైనారిటీలకు 2 పదవులు కేటాయించారు.

లోక్‌సభ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలి : అభిషేక్‌ బెనర్జీ

దేశంలో ఓట్ల చోరీ వ్యవహారం దుమారం రేపుతోంది తృణమూల్‌ కాంగ్రెస్‌ ఎంపీ అభిషేక్‌ బెనర్జీ తాజాగా కీలక వ్యాఖ్యలు చేశారు. గత సార్వత్రిక ఎన్నికల్లో ఓటర్ల జాబితాలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఆరోపించారు. లోక్‌సభ ఎన్నికలను మళ్లీ నిర్వహించాలని డిమాండ్‌ చేశారు. ‘గుజరాత్‌, ఉత్తరప్రదేశ్‌, మధ్యప్రదేశ్‌ వంటి కొన్ని రాష్ట్రాల్లో ఓటర్ల జాబితా సరిగ్గానే ఉందని.. పశ్చిమ బెంగాల్‌, బీహార్‌, తమిళనాడులో మాత్రమే తప్పుగా ఉన్నాయని ఈసీ చెబుతోంది. ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ఓటర్ల జాబితా నిర్వహిస్తే […]

రేవంత్ రెడ్డి సర్కార్‌కు కవిత సూటి ప్రశ్న..

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీసీ రిజర్వేషన్లపై ఎందుకు ప్రధానమంత్రి మోదీతో అఖిలపక్ష భేటీ ఏర్పాటు చేయలేదని నిలదీశారు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత , రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అయ్యాకే బీసీ రిజర్వేషన్లు అమలు చేస్తామన్న కాంగ్రెస్ మాట ఏమిటి? అని కవిత ప్రశ్నించారు. ఇప్పుడు బీసీ రిజర్వేషన్లను అమలు చేయమన్న డిమాండ్‌ను ఎందుకు అంగీకరించరు? అసెంబ్లీ ఎన్నికల ముందు ఇదే విషయాన్ని ఎందుకు చెప్పలేదు? అని ఆమె నిలదీశారు.

పులివెందులలో టెన్షన్ టెన్షన్.. కీలక నేతల హౌస్ అరెస్ట్

పులివెందులలో జరుగుతున్న జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్ సందర్భంగా భారీగా అక్రమాలు జరుగుతున్నాయని వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డి తీవ్ర ఆరోపణలు చేశారు. ముఖ్యంగా, కొత్తపల్లిలోని పోలింగ్ కేంద్రం వద్ద వైసీపీ ఏజెంట్లపై దాడి జరిగిందని ఆయన పేర్కొన్నారు. తనను అక్రమంగా అరెస్ట్ చేశారని ఎంపీ అవినాశ్ రెడ్డి ఆరోపించారు. తాను ఇంట్లో ప్రశాంతంగా ఉన్నప్పటికీ, పోలీసులు దౌర్జన్యంగా తనను అరెస్ట్ చేశారని, ఇది అప్రజాస్వామిక చర్య అని అన్నారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON