loader

ఇరాన్‌లో 555 మంది పౌరులు బలి

ఇరాన్‌లోని పలు నగరాలు, ప్రత్యేకించి రాజధాని టెహరాన్‌ను లక్షంగా చేసుకుని ఇజ్రాయెల్, అమెరికా సేనలు నిర్విరామంగా దాడులకు దిగుతున్నాయి. టెహరాన్ ఆకాశం ఎప్పుడూ నిప్పులు కక్కే రీతిలో మారుతోంది. క్షిపణులు, యుద్ధ విమానాలను ఎక్కువగా ప్రయోగిస్తున్నారు. ఇప్పటికే ఈ రెండు దేశాల దాడులతో ఇరాన్‌లో 555 మంది వరకూ పౌరులు మృతి చెందినట్లు, ఇది తమకు అదికారికంగా అంటే నిర్థారణ అయిన సమాచారం అని ఇరాన్ రెడ్ క్రిసెంట్ సొసైటీ సోమవారం తెలిపింది.

కాంగ్రెస్‌ను శివుడితో.. బీజేపీని విష్ణువుతో పోల్చిన రాహుల్ గాంధీ

కాంగ్రెస్‌ను శివుడితో.. బీజేపీని విష్ణువుతో పోల్చిన రాహుల్ గాంధీ..వ్యాఖ్యలు ఇప్పుడు వివాదాస్పదం అవుతున్నాయి. కాంగ్రెస్‌ పార్టీకి శివుడి పోలిక ఉందన్న రాహుల్.. మహా శివుడు తన శరీరంలో సగభాగాన్ని మహిళకు ఇచ్చి.. నిరాడంబరంగా.. అడిగితే ఇచ్చే విధంగా ఉంటాడని తెలిపారు. ఇక శివుడి వద్ద త్రిశూలం ఉండి కూడా.. అది ఆయన వెనకే ఉంటుందని పేర్కొన్నారు.విష్ణువు లాగా బీజేపీ పార్టీ ఆడంబరంగా.. కేవలం అధికారంపై మాత్రమే దృష్టి పెట్టే విధానాన్ని అనుసరిస్తుందని విమర్శలు చేశారు.

అయ్యప్ప దేవాలయంలోకి మహిళల్ని అనుమతించం -దేవస్థానం బోర్డు అఫిడవిట్

శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయంలోకి 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తూ ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు సుప్రీంకోర్టులో అఫిడవిట్ దాఖలు చేయాలని బోర్డు నిశ్చయించింది. ఆలయ సంప్రదాయాలు, ఆచారాలను కాపాడాల్సిన చట్టబద్ధమైన బాధ్యత తమపై ఉందని, అందుకే మహిళల ప్రవేశాన్ని వ్యతిరేకిస్తున్నట్లు బోర్డు స్పష్టం చేసింది. సోమవారం జరిగిన బోర్డు సమావేశంలో ఈ మేరకు ఒక తీర్మానాన్ని ఆమోదించారు. దేవాలయాల్లోని ఆచార వ్యవహారాలను, […]

మత్తు మందు ఇచ్చి విద్యార్ధినిపై లైంగిక దాడి.. నగ్న ఫొటోలు సోషల్ మీడియాలో పెడుతానని బెదిరింపు..!

హైదరాబాద్‌ బాచుపల్లిలోని ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో విద్యార్ధినిపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఆశిష్ అతని స్నేహితుడు ప్రవీణ్ గత ఏడాది కాలంగా ANC అనే డార్క్ వెబ్ నుండి తన కూతురికి చాక్లెట్లు, టాబ్లెట్లు,మత్తు మందు ఇచ్చి కాలేజ్, హోటల్లో లైంగిక దాడులకు పాల్పడుతున్నాడని ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది.కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేస్తున్నారు అతడి వేధింపులు తాళలేక సదరు యువతి శనివారం […]

రేపు చంద్రగ్రహణం..2029 వరకు చివరిది ఇదే

2029 వరకు కనిపించని చివరి చంద్రగ్రహణం మంగళవారం దర్శనం ఇవ్వనుంది. తదుపరి చంద్రగ్రహణం 2028 డిసెంబర్31 2029 జనవరి1న దర్శనం ఇవ్వనుంది. భారత దేశంలో సాయంత్రం 3.20 గంటలకు ప్రారంభమై 6.46 గంటలకు ముగుస్తుంది. ఆస్ట్రేలియా, అయోటిఅరోయా న్యూజిలాండ్‌ల్లో ఈ గ్రహణం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ గ్రహణ సమయంలో చంద్రుడు ఎరుపు రంగులో కనిపిస్తాడు కాబట్టి బ్లడ్‌మూన్ అని పిలుస్తారు. హోలీ పండగ రోజున ఈ గ్రహణం ఏర్పడుతుండడం విశేషం.

వార్ ఎఫెక్ట్​- మక్కాలో చిక్కుకున్న వేలాది భారతీయులు!

పశ్చిమాసియాలో కమ్ముకున్న యుద్ధ మేఘాలు, భారతీయులపై కూడా తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా పవిత్ర రంజాన్​ వేళ మక్కాకు వెళ్లిన వేలాది భారతీయుల భక్తులు అక్కడే చిక్కుకుపోయారని సమాచారం. పవిత్ర రంజాన్ మాసంలో ఉమ్రా కోసం వేలాది మంది ముస్లిం భక్తులు మక్కా వెళ్లారు. భారత్​ నుంచి వెళ్లిన భక్తులు మక్కా, మదీనాల్లో చిక్కుకుపోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనితో రెండో అష్రా కోసం వెళ్లాలనుకున్న భక్తుల ప్రణాళికలు పూర్తిగా తలకిందులు అయ్యాయి.

ఢిల్లీలో గిరిజన కళా మహోత్సవం ప్రారంభం

దేశ గిరిజన కళా సంపదకు జాతీయ వేదికగా నిలిచే గిరిజన కళా మహోత్సవం–2026ను కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రి జువల్ ఓరం ప్రారంభించారు. ట్రావన్‌కోర్ ప్యాలెస్లో జరుగుతున్న ఈ 12 రోజుల ఉత్సవం మార్చి 3 నుంచి 13 వరకు ప్రజలకు అందుబాటులో ఉంటుంది. దేశవ్యాప్తంగా 30కు పైగా గిరిజన కళారూపాలు, 75 మంది కళాకారులు, వెయ్యికి పైగా కళాఖండాలు ఈ ప్రదర్శనలో చోటు చేసుకున్నాయి. గిరిజన దృశ్యకళా సంపదను సమగ్రంగా ఆవిష్కరించే అరుదైన అవకాశమిది.

భారత్ కెనడా మధ్య యురేనియం ఒప్పందం

భారత్‌కెనడా మధ్య సోమవారం 2.6 బిలియన్ డాలర్ల విలువైన యురేనియం సరఫరా ఒప్పందం కుదిరింది.ఈమేరకు రెండు దేశాలు సంతకాలు చేశాయి. అలాగే సమగ్ర ఆర్థిక భాగస్వామ్య ఒప్పందంపై చర్చలు జరిపేందుకు అంగీకారం కుదిరింది. హైదరాబాద్ హౌస్‌లో ప్రధాని నరేంద్రమోడీ, కెనడా ప్రధాని మార్క్ కార్నీ మధ్య జరిగిన సమావేశంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకున్నారు. దేశంలో పౌర అణు ఇంధన కార్యక్రమానికి నిరంతర సరఫరాను నిర్ధారించడమే ఈ డీల్ ఉద్దేశం.

ఇజ్రాయెల్ దాడుల్లో గాయపడిన ఖమేనీ భార్య మన్సూరే మృతి

అమెరికా మద్దతుతో ఇజ్రాయెల్ గత శనివారంనాడు తొలిసారి టెహ్రాన్‌పై జరిపిన దాడుల్లో తీవ్రంగా గాయపడిన ఇరాన్ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ భార్య మన్సూరే ఖోజాస్తే సోమవారంనాడు మరణించినట్టు ఆదేశ అధికారిక వార్తా సంస్థ తెలిపింది. ఖమేనీ నివాసంపై ఇజ్రాయెల్ జరిపిన దాడుల్లో ఇప్పటికే ఖమేనీతో పాటు ఆయన కుమార్తె, అల్లుడు, మనుమరాలు మృతి చెందారు. ఖమేనీ మృతితో ఇప్పటికే ఉద్రిక్తతలు చోటుచేసుకోగా, మన్సూర్ ఖోజాస్తే కూడా మరణించడంతో టెహ్రాన్ నాయకత్వంపై ఒత్తిడి పెరిగి ఉద్రితకలు […]

సౌదీ, బహ్రెయిన్ నేతలకు మోదీ ఫోన్.. భారతీయుల భద్రతపై ఆరా

ఇజ్రాయెల్‌తో పాటు గల్ఫ్ దేశాల్లోని అమెరికా సైనిక స్థావరాలపై ఇరాన్ క్షిపణలు, డ్రోన్ దాడులపై విరుచుకుపడుతుండటం పరిస్థితిని మరింత తీవ్రం చేస్తోంది. ఈ నేపథ్యంలో సౌదీ అరేబియా క్రౌన్ ప్రిన్స్ మహమ్మద్ బిన్ సల్మాన్ అల్ సౌద్, బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సోమవారంనాడు ఫోను చేశారు. ఇరువురు నేతలతో సంభాషణల్లో సౌదీ అరేబియా, బహ్రెయిన్‌పై ఇరాన్ జరుపుతున్న దాడులను మోదీ ఖండించారు. రెండు దేశాల్లోని భారతీయుల […]

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON