loader

చిన్నస్వామి స్టేడియంలో ఫ్యాన్స్ భద్రతకు AI టెక్నాలజీ, ఖర్చు భరించనున్న RCB

కర్ణాటక స్టేట్ క్రికెట్ అసోసియేషన్ కి రాసిన లేఖలో, RCB ఫ్రాంచైజీ చిన్నస్వామి స్టేడియంలో 300-350 AI-ఎనేబుల్డ్ కెమెరాలను ఏర్పాటు చేయాలని సూచించింది. ఇది ప్రజల కదలికలను పర్యవేక్షించడానికి, పెద్ద క్యూ లైన్లు, స్టేడియం ఎగ్జిట్ ప్రాంతాలను కూడా పర్యవేక్షించడానికి వీలు కల్పిస్తుంది. స్టేడియంలో AI కెమెరాలను ఏర్పాటు చేసే ఖర్చును తామే భరిస్తామని రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఫ్రాంచైజీ (RCB) తెలిపింది. దీని మొత్తం వ్యయం దాదాపు 4.5 కోట్ల రూపాయలు కావచ్చని తెలుస్తోంది.

ఏపీకి మరో భారీ పెట్టుబడి.. ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్

ఏపీకి మరో భారీ పెట్టుబడి రానుంది. ఏపీలో ప్రపంచంలోనే అతిపెద్ద గ్రీన్ అమ్మోనియా కాంప్లెక్స్ ఏర్పాటు కానుంది. ఏఎం గ్రీన్ సంస్థ 10 బిలియన్ డాలర్ల పెట్టుబడితో కాకినాడలో గ్రీన్ అమ్మోనియా ప్లాంట్ ఏర్పాటు చేయనుంది. ఈ విషయాన్ని ఏపీ మంత్రి నారా లోకేష్ ధ్రువీకరించారు. ఈ ప్రాజెక్టు ద్వారా 8 వేల ఉద్యోగాలు లభిస్తాయని వెల్లడించారు. 2030 నాటికి ఏటా 1.5 మిలియన్ టన్నుల గ్రీన్ అమ్మోనియాను ఈ ప్లాంట్ ద్వారా ఉత్పత్తి చేయనున్నట్లు తెలిపారు.

పురుషుల వేషం వేసి.. ఇంట్లో చోరీకి పాల్పడిన మహిళలు

బెంగళూరులో ఇద్దరు మహిళలు పురుషుల వేషం వేసి ఒక ఇంట్లో దొంగతనానికి పాల్పడ్డారు. ఆ వ్యక్తి ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేశారు. చోరీ చేసింది మహిళలని తెలుసుకుని షాక్‌ అయ్యారు. స్కూటీ నంబర్‌ ఆధారంగా చోరీకి పాల్పడింది మహిళలని తెలుసుకుని షాక్‌ అయ్యారు. బెంగళూరుకు చెందిన షాలు, నీలుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

భారత్​లో 5జీ యూజర్లు 40 కోట్లు- జ్యోతిరాదిత్య సింధియా

ప్రపంచంలో 5జీ నెట్​వర్క్​ వినియోగంలో భారత్​ రెండో అతిపెద్ద దేశంగా నిలిచిందని భారత కేంద్ర కమ్యూనికేషన్ల మంత్రి జ్యోతిరాదిత్య సింధియా పేర్కొన్నారు. “40 కోట్లకు పైగా 5G వినియోగదారులతో, భారత్​ నేడు ప్రపంచంలోనే రెండో అతిపెద్ద 5G చందాదారుల స్థావరంగా నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా ఈ సాంకేతికతను స్వీకరిస్తున్న దేశాలలో ఒకటిగా నిలిచింది. 110 కోట్ల యూజర్లతో చైనా మొదటి స్థానంలో నిలువగా, 35 కోట్ల వినియోగదారులతో అమెరికా మూడో స్థానంలో నిలిచింది.

బీఆర్ఎస్ పాలకుల ఉద్యోగాలు పోతేనే మీకు ఉద్యోగాలు వచ్చాయి: సీఎం

హైటెక్ సిటీ సమీపంలోని శిల్పకళా వేదికలో కొలువుల పండగ కార్యక్రమంలో సీఎం రేవంత్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా గ్రూప్ – 3కి ఎంపికైన 1,370 మంది అభ్యర్థులకు నియామక పత్రాలను అందజేశారు. బీఆర్ఎస్ పాలకుల ఉద్యోగాలు పోతేనే మీకు ఉద్యోగాలు వచ్చాయని గ్రూప్ – 3 విజేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. పిల్లల భవిష్యత్‌ కోసం తల్లిదండ్రులు ఎంతో కష్టపడుతున్నారని చెప్పారు. ఉద్యోగాలు ఇవ్వకూడదని కోర్టుల్లో కేసులూ వేశారంటూ బీఆర్ఎస్ నేతల వైఖరిని తప్పు పట్టారు.

సమాజ ఆరోగ్య వ్యవస్థలో గిరిజన వైద్యులకు భాగస్వామ్యం

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ శుక్రవారం హైదరాబాద్‌లోని కన్హా శాంతి వనం వేదికగా జాతీయ స్థాయి సామర్థ్యాభివృద్ధి కార్యక్రమాన్ని ప్రారంభించింది. ‘ప్రాజెక్ట్ దృష్టి’ కింద భారత్ ట్రైబల్ హెల్త్ అబ్జర్వేటరీ పేరుతో దేశంలో తొలి జాతీయ గిరిజన ఆరోగ్య పరిశీలనా కేంద్రం ఏర్పాటు కానుంది. గిరిజన వైద్యులను (ట్రైబల్ హీలర్స్) సమాజ ఆరోగ్య వ్యవస్థలో భాగస్వాములుగా తీర్చిదిద్దే లక్ష్యంతో గిరిజన వైద్యులను అధికారికంగా గుర్తించి, ప్రజారోగ్య వ్యవస్థతో అనుసంధానించే తొలి జాతీయ ప్రయత్నంగా ఈ కార్యక్రమం […]

హైదరాబాద్ నగరంలో ఈ రాత్రి 10 గంటల నుంచి ఫ్లైఓవర్ల మూసివేత

ఇవాళ ముస్లింల పవిత్ర దినమైన షబ్‌-ఈ-మేరజ్‌(జగ్‌నే కి రాత్‌) దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్‌లోని పలు ప్రధాన ఫ్లైఓవర్లు మూసి వేస్తున్నారు. నేడు(జనవరి 16) రాత్రి 10 గంటల నుంచి ఫ్లైఓవర్లను మూసి వేయనున్నారు. జనవరి 16, 17 తేదీలలో జరిగే షబ్‌-ఈ-మేరజ్‌ పండుగ దృష్ట్యా.. గ్రీన్‌ల్యాండ్ ఫ్లైఓవర్, పీవీఎన్‌ఆర్ ఎక్స్‌ప్రేస్‌వే.. ఇంకా లంగర్ హౌస్ ఫ్లైఓవర్‌లు మినహా హైదరాబాద్‌లోని అన్ని ఫ్లైఓవర్‌లు మూసివేస్తారు. అవసరమైతే తెలంగాణ తల్లి, షేక్‌పేట్, మన్మోహన్ సింగ్, బహదూర్‌పురా ఎక్స్ రోడ్ ఫ్లైఓవర్లనూ […]

ముంబై పీఠంపై కాషాయ జెండా.. బీజేపీ కూటమి ప్రభంజనం !

దేశ ఆర్థిక రాజధాని ముంబై మహానగర పాలక సంస్థ (BMC) ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని మహాయుతి కూటమి చారిత్రక విజయం సాధించింది. మొత్తం 227 స్థానాలకు గాను మేజిక్ ఫిగర్ దాటేసి ఏకంగా 120 సీట్లు కైవసం చేసుకుంది. ఇందులో బీజేపీ ఒక్కటే 93 స్థానాల్లో గెలుపొంది సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించగా, మిత్రపక్షం శివసేన (షిండే వర్గం) 27 స్థానాల్లో జయకేతనం ఎగురవేసింది. మరోవైపు మూడు దశాబ్దాల పాటు ముంబైపై ఏకచక్రాధిపత్యం వహించిన […]

తిరుపతి జిల్లాకు మహర్దశ: APFIRST పేరుతోఅతిపెద్ద రీసెర్చ్ సెంటర్- సీఎం గ్రీన్ సిగ్నల్

తిరుపతిలో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు సీఎం చంద్రబాబు నాయుడు ఆమోదం తెలిపారు. APFIRST పేరుతో అతిపెద్ద రీసెర్చ్ సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది.ఏపీ ఫ్యూచరిస్టిక్ ఇన్నోవేషన్ అండ్ రీసెర్చ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ-APFIRST ఏర్పాటునకు సీఎం చంద్రబాబు నాయుడు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.యువత భవిష్యత్తుకు బాటలు వేసేలా సీఎం చంద్రబాబు నాయుడు ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు తెలుస్తోంది.

ధరణి రిజిస్ట్రేషన్లలో ఎడిట్ దగా-కోట్ల కుంభకోణం బట్టబయలు

ధరణి,భూభారతి రిజిస్ట్రేషన్లను అడ్డు పెట్టుకుని జనగామ, యాదాద్రి జిల్లాల్లో సంచలనం సృష్టించిన ఈ రూ. 3.90 కోట్ల కుంభకోణంలో ప్రమేయం ఉన్న 15 మంది నిందితులను పోలీసులు అరెస్ట్ చేసారు, వీరు వెబ్‌సైట్‌లోని ఇన్‌స్పెక్ట్ ఎలిమెంట్, ఎడిట్ అప్లికేషన్ ఆప్షన్లను ఉపయోగించి ప్రభుత్వానికి చెల్లించాల్సిన చలాన్ రుసుమును సాఫ్ట్‌వేర్ ద్వారా తగ్గించేవారు. రైతుల వద్ద నుంచి పూర్తి మొత్తాన్ని వసూలు చేసి, ప్రభుత్వానికి మాత్రం తక్కువ మొత్తాన్ని చెల్లిస్తూ నకిలీ రసీదులను సృష్టించేవారు.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON