loader

రైతుల కోసం పవనన్న ప్రత్యేకంగా ఒప్పించారు.. మంత్రి నారా లోకేష్

ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు మంత్రి నారా లోకేష్ అభినందనలు తెలిపారు. యువగళం పాదయాత్ర సందర్భంగా ఏనుగుల విధ్వంసంతో తాము తీవ్రంగా నష్టపోతున్నామని పలమనేరు ప్రాంత రైతన్నలు నా దృష్టికి తెచ్చారు. రైతాంగం ఇక్కట్లను తొలగించేందుకు పవనన్న ప్రత్యేకంగా చొరవచూపి కర్ణాటక ప్రభుత్వంతో మాట్లాడి ఒప్పించారు. ఏపీ అవసరాలకు మరిన్ని కుంకీ ఏనుగులు ఇస్తామని హామీ ఇచ్చిన కర్ణాటక ప్రభుత్వానికి కూడా నా కృతజ్ఞతలు’ అంటూ ట్వీట్ చేశారు.

లిక్కర్ స్కాం కేసుపై వైఎస్ జగన్ రియాక్షన్…

తొలిసారిగా లిక్కర్‌ కేసుపై స్పందించారు. తమ ప్రభుత్వంలో లిక్కర్ స్కాం జరిగేందుకు ఆస్కారమే లేదు అని వివరణ ఇచ్చారు. ‘లిక్కర్‌ అమ్మకాలు పెరిగితే లంచాలు ఇస్తారు,వైసీపీ హయాంలో లిక్కర్‌ అమ్మకాలు తగ్గాయి, మద్యం తయారీ సంస్థలు నష్టపోయాయి. నష్టపోయినప్పుడు మద్యం సంస్థలు లంచాలు ఎందుకిస్తాయి. మద్యం విక్రయాలు ప్రైవేటుకి ఇస్తే లంచాలు ఇస్తారు. మా హయాంలో ప్రభుత్వమే మద్యం దుకాణాలు నడిపింది’అని వైసీపీ అధినేత వైఎస్ జగన్ తెలిపారు. లిక్కర్‌ కుంభకోణాలు ఇప్పుడు టీడీపీ చేస్తోంది అని […]

ఎలాన్ మస్క్ స్పేస్ ఎక్స్ రాకెట్ బేస్‌లో అగ్నిప్రమాదం..

టెక్సాస్‌లోని స్పేస్‌ఎక్స్ మెక్‌గ్రెగర్ పరీక్షా కేంద్రం బుధవారం భారీ పేలుడుతో దద్దరిల్లింది. ఎలాన్ మస్క్‌కు చెందిన స్పేస్‌ ఎక్స్‌ టెక్సాస్‌ మెక్‌గ్రెగోర్ బేస్‌లో రాకెట్ ఇంజిన్ టెస్టింగ్ సమయంలో భారీ పేలుడు సంభవించింది. ఆక్సిజన్, మీథేన్ గ్యాస్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బంది రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చింది. అగ్నిప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సమీపంలోని సీసీ కెమెరాలో రికార్డు కాగా, క్షణాల్లో సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌పై చక్కర్లు కొట్టాయి.

జగన్ వార్నింగ్‌కి ఒక్క నవ్వుతో సమాధానం ఇచ్చిన పవన్

మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వైఎస్సార్‌సీపీ నేతల సమావేశంలో కూటమి ప్రభుత్వం, అధికారులకు ఇచ్చిన వార్నింగ్‌‌ అంశంపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ దగ్గర మీడియా ప్రతినిధులు ప్రస్తావించారు. పవన్ కళ్యాణ్ మాత్రం ఒక్క నవ్వుతో సమాధానం ఇచ్చారు.. చివర్లో చూద్దాం అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయారు.

నాంపల్లి కోర్డుకు హాజరైన సీఎం రేవంత్ రెడ్డి..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి తనపై నమోదైన ఎన్నికల కోడ్ ఉల్లంఘన కేసుల విచారణకు నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు రెండోసారి వ్యక్తిగతంగా హాజరయ్యారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో రిజర్వేషన్లపై ఆయన చేసిన వ్యాఖ్యలకు సంబంధించి హైదరాబాద్, నల్గొండ, మెదక్ జిల్లాల్లో మూడు కేసులు నమోదయ్యాయి. తాను నిర్దోషినని, పోలీసులు తప్పుడు కేసులు పెట్టారని రేవంత్ రెడ్డి తాజాగా వాంగ్మూలం ఇచ్చారు.

చంద్రబాబుకు విజయసాయిరెడ్డి లొంగిపోయారు… వైఎస్ జగన్

విజయసాయిరెడ్డి రాజీనామాపై తాజాగా వైఎస్ జగన్ తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు విజయసాయిరెడ్డి లొంగిపోయారని ఆరోపించారు. ఏపీలోని కూటమి ప్రభుత్వానికి మేలు జరుగుతుందని తెలిసి… తన మూడున్నరేళ్ల రాజ్యసభ టర్మ్‌ను ప్రలోభాలకు లోనై అమ్మేశారని సంచలన ఆరోపణలు చేశారు.

థియేటర్‌లలోకి రాకముందే సినిమాలు లీక్‌.. పైరసీతో రూ.22,400 కోట్ల నష్టం

ఓ నివేదిక ప్రకారం దేశంలో రూ.22,400 కోట్ల సినిమా లీక్ కుంభకోణం బయటపడింది. రైడ్ 2, సికందర్, జాట్ వంటి ప్రధాన హిందీ చిత్రాలు థియేటర్లలో విడుదలకు ఒక రోజు ముందు ఆన్‌లైన్‌లో లీక్ అయ్యాయి. ఈ విధంగా సినిమాలు లీక్ కావడం చూస్తుంటే పరిశ్రమలోని వ్యక్తుల ప్రమేయాన్ని సూచిస్తుంది’ అని మాజీ ఎంపీ డాక్టర్ సుభాష్ చంద్ర తెలిపారు. పైరసీ ద్వారా సంపాదించిన డబ్బును ఉగ్రవాదాన్ని వ్యాప్తి చేయడానికి ఉపయోగించవచ్చు అని ఆందోళన వ్యక్తం చేశారు.

హనుమజ్జయంతి

హనుమంతుని జన్మోత్సవం వైశాఖ శుద్ధ దశమి నాడు జరుపుకుంటారు. ఈ రోజున హనుమాన్ భక్తులు రోజంతా ఉపవాసముండి, హనుమన్ చాలిసా పఠనం, రామనామ జపం చేస్తారు హనుమంతుని జన్మవృత్తాంతం శివమహాపురాణం, రామాయణం,మొదలైన గ్రంథాలలో అనేకానేక గాధలతో వివరించబడి వుంది .

కన్నడ రచయిత్రి బాను ముస్తాక్‌కు బుకర్ ప్రైజ్

న్యాయవాది బాను ముస్తాక్ ఈ ఏటి 2025 ప్రతిష్టాత్మక బుకర్ ప్రైజ్ గెల్చుకున్నారు. హార్ట్ ల్యాంప్ ( హృదయ దీపం) అనే మె కథాసంకలనంలోని ఇతివృత్తానికి, రచనా నైపుణ్యానికి ఆమెకు ఈ అంతర్జాతీయ ప్రఖ్యాత సాహిత్య పురస్కారం దక్కింది. బాను ముస్తాక్ ఈ అవార్డు పొందిన తొలి కన్నడ సాహితివేత్త అయ్యారు. మంగళవారం ఆమె లండన్‌లోని టాటే మాడర్న్‌లో జరిగిన కార్యక్రమంలో ఈ పురస్కారం అందుకున్నారు.

అమెరికా గోల్డెన్ డోమ్ డిఫెన్స్ సిస్టమ్

అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ మంగళవారం దేశ రక్షణ వ్యవస్థకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అమెరికా రక్షణకు అత్యంత శక్తివంతమైన క్షిపణి భద్రతా వ్యవస్థ ‘గోల్డెన్ డోమ్’ ను చేపట్టనున్నట్లు ప్రకటించారు. ఈ గోల్డెన్ డోమ్ లక్ష్యం ఏంటంటే.. శత్రు క్షిపణులను వెంటనే గుర్తించడం, ట్రాక్ చేయడం, వాటిని మధ్యలోనే ఆకాశంలోనే నాశనం చేయడం. మొత్తం వ్యవస్థను నిర్మించడానికి దాదాపు 175 బిలియన్ డాలర్లు ఖర్చవుతుందని సమాచారం.

PHONE NUMBER

+91 8886919288

EMAIL

news4short@gmail.com

LOCATION

12-8,
Vijaya Lakshmi Complex
Madhapur,
Hyderabad 500018

DOWNLOAD APP

FOLLOW US ON