ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన నివాసంలో ప్రథమ పూజ్యుడైన శ్రీ గణేశుడికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ వేడుకలో ఆయన కుటుంబ సభ్యులు కూడా ఉత్సాహంగా పాలుపంచుకున్నారు. స్వామివారికి భక్తితో నమస్కరించి, రాష్ట్ర ప్రజల శ్రేయస్సును కోరుతూ ప్రత్యేక ఆశీస్సులు అందుకున్నారు.వినాయక చవితి సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రజలందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు