ఒంగోలు పౌరుషానికి, సంస్కృతికి ప్రతీకగా నిలిచే ప్రపంచ ప్రసిద్ధ ఒంగోలు జాతి గిత్తకు 12 అడుగుల భారీ విగ్రహాన్ని నగర శివారులో ఏర్పాటు చేశారు. ఒంగోలు మున్సిపాలిటీగా ఏర్పడి 150 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా ఈ విగ్రహాన్ని ప్రత్యేకంగా రూపొందించారు. ప్రముఖ శిల్పి లక్కు వర్మ జీవం ఉట్టిపడేలా డిజైన్ చేశారు. కండలు తిరిగిన దేహంతో,ఒంగోలు గిత్త కళ్లు, వాడి కొమ్ములు, దర్పం ఉట్టిపడేలా ముఖ కవళికలను అద్భుతంగా చెక్కారు.