అమెరికాలో మరో భారత జాతీయుడు దుండగుల కాల్పులకు బలయ్యాడు. టెన్నెస్సీ రాష్ట్రం లోని జాక్సన్ నగరంలో గుజరాత్కు చెందిన సురేష్ పటేల్కు చెందిన ‘రిడ్జ్క్రెస్ట్ సెల్లార్స్’ అనే మద్యం దుకాణంలోకి మాస్క్ ధరించిన ఓ ఆగంతకుడు ప్రవేశించాడు. తుపాకీతో బెదిరించి నగదు ఇవ్వాలని డిమాండ్ చేశాడు. డబ్బు తీసుకున్న అనంతరం నిందితుడు విచక్షణారహితంగా కాల్పులు జరిపాడు. ఈ కాల్పుల్లో సురేష్ పటేల్ అక్కడికక్కడే మృతిచెందారు. కుమార్తె కళ్లెదుటే తండ్రిని దుండగుడు కాల్చి చంపడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.