స్వర్ణాంధ్ర- స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా శనివారం అనకాపల్లి జిల్లా కే. కోటపాడు మండలం ఏ కోడూరు గ్రామంలో నిర్వహించిన బహిరంగ ప్రజావేదిక సభలో పాల్గొన్న ముఖ్యమంత్రి ఉత్తారంధ్ర సమగ్ర అభివృద్ధికి సంబంధించిన భవిష్యత్ కార్యాచరణను ప్రజల ముందు పెట్టారు. ఉత్తరాంధ్ర ప్రజల దశాబ్ధాల దాహార్తిని తీరుస్తూ, రాబోయే సెప్టెంబర్ మొదటి
వారంలో అనకాపల్లి, విశాఖ పట్నం జిల్లాలకు పవిత్ర గోదావరి జలాలు రప్పిస్తామని అన్నారు. అనకాపల్లిని దేశంలో నంబర్ వన్ పారిశ్రామిక సామ్రాజ్యంగా తీర్చిద్దిద్దే బాధ్యతను తాము భుజానికి ఎత్తుకున్నామని చంద్రబాబు స్పష్టం చేశారు