తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియలో కీలక ఘట్టం పూర్తయింది. రాష్ట్ర ఎన్నికల సంఘం ఎస్ఐఆర్ ముసాయిదా ఓటర్ల జాబితాను విడుదల చేసింది. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి సుదర్శన్రెడ్డి వెల్లడించిన వివరాల ప్రకారం.. రాష్ట్రంలో సుమారు 92 లక్షల మంది ఓటర్లకు నోటీసులు జారీ చేయనున్నారు. నోటీసులు అందుకున్న ఓటర్లు తమ వివరాలను, అవసరమైన పత్రాలను సమర్పించి తమ ఓటు వివరాలను నిర్ధారించుకోవాల్సి ఉంటుంది. సెప్టెంబర్ 16వ తేదీ వరకు నోటీసులకు సమాధానం ఇచ్చేందుకు గడువు ఉన్నట్లు తెలిపారు.