ఇజ్రాయెల్ ప్రధాని బెన్జమిన్ నెతన్యాహు గురువారం భారత ప్రధాని నరేంద్ర మోదీకి స్వయంగా ఫోన్ చేశారు. పశ్చిమాసియాలో తాజా పరిస్థితులు, యుద్ధ మేఘాల మధ్య ప్రాంతీయ శాంతిభద్రతలతో పాటు భారత్-ఇజ్రాయెల్ ద్వైపాక్షిక సంబంధాలపై ఇరువురూ సుదీర్ఘంగా చర్చించారు. ఈ ఫోన్ సంభాషణకు సంబంధించిన వివరాలను భారత ప్రధాని కార్యాలయం (PMO) అధికారిక ప్రకటన ద్వారా వెల్లడించింది. దౌత్యపరమైన రహస్యాల దృష్ట్యా సంభాషణకు సంబంధించిన పూర్తి వివరాలను ప్రభుత్వం బయటపెట్టకపోయినప్పటికీ, భవిష్యత్తులోనూ ఇద్దరూ నిరంతరం సంప్రదింపుల్లో ఉండాలని అంగీకారానికి వచ్చినట్లు పీఎంవో స్పష్టం చేసింది.