రష్యా–ఉక్రెయిన్ మధ్య నాలుగేళ్లకు పైగా కొనసాగుతున్న యుద్ధం మరింత తీవ్రరూపం దాల్చింది. శనివారం (జూలై 25) ఇరుదేశాలు ఒకదానిపై మరొకటి భారీ డ్రోన్, క్షిపణి దాడులు జరపడంతో పలువురు ప్రాణాలు కోల్పోయారు. రష్యా ఆక్రమిత జపోరిజ్జియా ప్రాంతంలోని విహార శిబిరాలపై ఉక్రెయిన్ జరిపిన దాడుల్లో 12 మంది మరణించారని మాస్కో ప్రకటించింది. మృతుల్లో నలుగురు చిన్నారులు ఉన్నట్లు క్రెమ్లిన్ నియమించిన ప్రాంతీయ అధిపతి యెవ్జెనీ బాలిట్స్కీ తెలిపారు.