సిరియాలో విషాదకరమైన రోడ్డు ప్రమాదం
చోటుచేసుకుంది. డమస్కస్-డెయిర్ ఎజోర్
ప్రధాన రహదారిపై రెండు బస్సులు ఒకదానికొకటి ఢీకొన్న ఘటన లో కనీసం 35 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ భీకర ప్రమాదంలో మరో 30 మందికి పైగా ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.ప్రమాదానికి గురైన వాహనాల్లో ఒకటి భద్రతా దళాలకు చెందిన బస్సు కాగా, మరొకటి సాధారణ ప్రయాణికులతో వెళ్తున్న సివిలియన్ బస్సు. తీవ్రమైన వేగంతో వస్తున్న ఈ రెండు బస్సులు డెయిర్ ఎజోర్ మార్గంలో ఒకదానినొకటి కొలైడ్ అయ్యాయి.