నటి జ్యోతిక సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. దేశంలో జరుగుతున్న విద్యార్థి ఉద్యమాలకు ఆమె బహిరంగంగా సంఘీభావం తెలిపారు. ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి.. విద్యార్థుల పక్షాన నిలుస్తున్నా.. అంటూ పోస్ట్ పెట్టారు. తన పోస్టులో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని జ్యోతిక డిమాండ్ చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, బాధ్యతాయుతమైన పాలన, ప్రజాస్వామ్య విలువలు, విద్యా వ్యవస్థలో సంస్కరణలకు తాను సపోర్టు ఇస్తున్నట్లు పేర్కొన్నారు.