గచ్చిబౌలిలోని ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో శనివారం విషాదం చోటుచేసుకుంది. ఇక్కడ B.Tech రెండో సంవత్సరం చదువుతున్న అభిరూప్ (20) అనే విద్యార్థి, తాను ఉంటున్న హాస్టల్ బిల్డింగ్ 6వ అంతస్తు పైనుంచి కిందకు దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు.ప్రాథమిక సమాచారం ప్రకారం, ఖమ్మం జిల్లాకు చెందిన అభిరూప్ గత కొంతకాలంగా తీవ్ర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నాడు. అదే సమయంలో కుటుంబ సమస్యల వల్ల తీవ్రమైన మానసిక బాధ అనుభవిస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వేదన భరించలేకే భవనం పైనుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడినట్లు ప్రాథమికంగా భావిస్తున్నారు.