2024 ఎన్నికల ముందు నుంచి బ్రదర్స్ ఇద్దరి మధ్య వార్ మొదలైంది. తాజాగా నాని ఈడీకి సుదీర్ఘ లేఖ రాసారు. అందులో చిన్ని ఆర్దిక వ్యవహారాల పైన ఫిర్యాదు చేసారు. కాగా, తనపై సోషల్ మీడియాలో దుష్ప్రచారం చేస్తున్నారని విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని ఇచ్చిన ఫిర్యాదును పరిశీలించిన పోలీసులు కేశినేని నానపై కేసు నమోదు చేశారు. ఇటీవల కాలంలో తనను లక్ష్యంగా చేసుకుని అసత్య ప్రచారం చేస్తున్నారని కేశినేని చిన్ని ఫిర్యాదులో పేర్కొన్నారు

