సుప్రీంకోర్టుకు ఐదుగురు కొత్త న్యాయమూర్తులను నియమిస్తూ కేంద్ర ప్రభుత్వం అధికారికంగా ఆమోదం తెలిపింది. కొలీజియం చేసిన సిఫార్సులకు కేంద్రం పచ్చజెండా ఊపడంతో ఈ నియమకాలు ఖరారయ్యాయి. కొత్తగా నియమితులైన వారిలో జస్టిస్ శీల్ నాగు, జస్టిస్ శ్రీ చంద్రశేఖర్, జస్టిస్ సంజీవ్ సచ్దేవా, జస్టిస్ అరుణ్ పల్లి ఈ నలుగురు వివిధ రాష్ట్రాల హైకోర్టుల ప్రధాన న్యాయమూర్తులు కాగా వి. మోహన సుప్రీంకోర్టు సీనియర్ మహిళా న్యాయవాది కావడం విశేషం.