అపర కుబేరులు గౌతమ్ అదానీ, ముఖేష్ అంబానీలకు అనుకూలంగా ప్రధాని నరేంద్ర మోడీ నిర్మించిన ఆర్థిక వ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోవడం ఖాయమని కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ ఆరోపించారు. దేశంలో ఆర్థిక తుఫాన్ అంచున ఉందని అన్నారు. మోడీపై రాహుల్ గాంధీ తీవ్ర విమర్శలు చేశారు. ఈ దెబ్బ మోడీ అదానీ, అంబానీలపై ఎలాంటి ప్రభావం చూపించదని, ఇది పూర్తిగా అనుభవించాల్సింది ప్రజలేనని తెలియజేశారు. దీనికి సరైన చర్యలు తీసుకోవడానికి బదులుగా మోడీ ప్రజలను విదేశీ పర్యటనలు మానుకోవాలని సూచించారు.