జనగామ జిల్లా ఆలీంపూర్ గ్రామంలోని ప్రాథమికోన్నత పాఠశాల ఆవరణలో మిషన్ భగీరథ పైప్ మరమ్మతుల కోసం అధికారులు 20 రోజుల క్రితం నాలుగు మీటర్ల పొడవైన గుంత తవ్వి ఉంచారు. పాఠశాలలోని అంగన్వాడీ ఆయా కూతురు మోక్షిత(5) ప్రమాదవశాత్తు ఆ గుంతలో పడిపోయింది. గమనించిన చిన్నారి అక్క దీక్షిత తల్లికి చెప్పింది. దీంతో వెంటనే తల్లి మోక్షితను బయటికి తీయగా, మోక్షిత అప్పటికే మృతి చెందింది. మిషన్ భగీరథ అధికారుల నిర్లక్ష్యం వల్లే చిన్నారి ప్రాణాలు కోల్పోయిందని మృతదేహంతో గ్రామస్తులు రోడ్డుపై ఆందోళనకు దిగారు.

