తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగుల పెండింగ్ బకాయిల కోసం రూ 1000 కోట్ల నిధులను ప్రభుత్వం విడుదల చేసింది. ఆర్దిక శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సందీప్ కుమార్ సుల్తానీయ ఈ మేరకు నిధుల విడుదల చేసారు. గత ఏడాది ఉద్యోగ సంఘాలతో జరిగిన చర్చల సందర్భంగా ప్రభుత్వం నెలకు రూ 700 కోట్ల విడుదలకు హామీ ఇచ్చింది. ఈ ప్రకారంగా మార్చి 2026 వరకు ప్రతీ నెలా ఉద్యోగ సంఘాల కు ఇచ్చిన మాట ప్రకారం నిధులు విడుదల చేసింది.

