<అనకాపల్లి జిల్లా నక్కపల్లి జాతీయ రహదారిపై అదుపుతప్పి ప్రైవేటు ట్రావెల్ బస్ కాలువలో బోల్తా పడింది. బస్సు ప్రమాదం జరిగే సమయంలో బస్సులో 36 మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో కొంతమందికి తీవ్రగాయాలు అవ్వగా, 12 మందికి స్వల్ప గాయాలు అయ్యాయి. క్షతగాత్రులను స్థానిక నక్కపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

