దళిత, గిరిజన, వెనుకబడిన వర్గాలకు చెందాల్సిన న్యాయమైన హక్కులను మోదీ సర్కార్ ఈ పునర్విభజన ప్రక్రియ ద్వారా లాక్కోవాలని చూస్తోందని రాహుల్ ఆరోపించారు. దక్షిణాది రాష్ట్రాల గొంతు నొక్కడానికి బీజేపీ ఈ కుట్రకు తెరలేపిందని ఆయన విమర్శించారు. నియోజకవర్గాల పునర్విభజన పేరిట పార్లమెంటులో తమ బలాన్ని అడ్డదారిలో పెంచుకునేందుకు అధికార పక్షం తీవ్రంగా ప్రయత్నిస్తోందని ఆయన స్పష్టం చేశారు. మహిళా రిజర్వేషన్ల ముసుగులో వారు ఆడుతున్న రాజకీయ నాటకాలను దేశ ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

