అంతర్జాతీయ క్రికెట్లో అవినీతిని ఏమాత్రం సహించబోమని ఐసీసీ (ICC) మరోసారి స్పష్టం చేసింది. క్రికెట్ వెస్టిండీస్ (CWI) నియమావళిని ఉల్లంఘించినట్లు తేలడంతో వెస్టిండీస్ ఫాస్ట్ బౌలింగ్ ఆల్రౌండర్ జావాన్ సియర్లెస్, టైటాన్స్ జట్టు యజమాని చిత్రరంజన్ రాథోడ్, జట్టు అధికారి గ్రిఫిత్లపై ఐసీసీ అభియోగాలు మోపింది. వీరిని తక్షణమే అన్ని రకాల క్రికెట్ కార్యకలాపాల నుంచి తాత్కాలికంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఒక ప్రకటనలో తెలిపింది.. 2023-24లో జరిగిన బిమ్10 టోర్నమెంట్లో ఈ ముగ్గురూ అవినీతికి పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి.

