గ్రామ సభల్లో సంక్షేమ పథకాల వారీగా ప్రభుత్వం చేకూరుస్తున్న లబ్ధిని ప్రజలకు వివరించాలని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. నిజమైన అర్హులు అందరికీ సంక్షేమ పథకాలు అందేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. మంగళవారం సచివాలయంలో కలెక్టర్లతో సీఎం రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ప్రజాపాలన- ప్రగతి ప్రణాళికపై కలెక్టర్లకు దిశా నిర్దేశం చేశారు. 99 రోజుల కార్యాచరణలో అందరి భాగస్వామ్యం ఉండాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పిలుపు ఇచ్చారు.

